మోదీ పని చెయ్యటమే కాదు చేయించగలరు కూడా! నాయకుడు వ్యక్తిగతంగా ఎంత పని చెయ్యగలడు? పోనీ అలా అని ఆదర్శవంతంగా నిలవవలసిన నాయుకుడు పనే చెయ్యకపోతే మిగతావారికి స్పూర్తిదాయకంగా ఉండలేకపోతాడు! అందువలన సమర్థవంతుడైన నాయకుడు తాను పనిచెయ్యాలి, ఆ ఆదర్శంతో మిగిలినవాళ్ళు కూడా పనిచేసేట్టుగా చెయ్యగలగాలి! అటువంటి నాయకత్వ లక్షణాలున్న ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ పగ్గాలందుకుని మూడురోజులే అయినా ఎంతో పని చేసి చూపించారు. కేబినెట్ మీటింగ్, అత్యవసరమైన దస్త్రాలను చూడటం, ప్రధాన మంత్రి కార్యాలయంలో అందరినీ పరిచయం చేసుకోవటం జరిగింది. మరో పక్క ట్విట్టర్, ఫేస్ బుక్, తనకి అభినందనలను తెలిపినవారికి కృతజ్ఞతలు తెలియజేయటం, పార్టీలోను, మిత్రపక్షాలలోను అందరినీ కలుపుకుపోవటం ఇవన్నీ చేస్తూనే కేబినెట్ మంత్రివర్గానికి మార్గదర్శకాలు కూడా ఇచ్చారు.
మనసులోనే ఆలోచిస్తే ఎంతకూ తేలదు. ఎంత చేసినా తృప్తి ఉండదు, అందుకు కారణం- చేసే పనులు క్రమబద్ధంగా లేకపోవటం. అందువలన నరేంద్ర మోదీ తన విజయరహస్యాలలో ఒకదాన్ని తనతో పనిచేస్తున్న మంత్రులకూ అందించారు. అదేమిటంటే వంద రోజుల ప్రణాళిక వేసుకోవటం!
ప్రస్తుతం ఉన్న సందర్భాలను కూలంకషంగా పరిశీలించి, చెయ్యదలచుకున్న పనిని ప్రణాలికగా వేసుకుని, వాటిని వందరోజులలో పూర్తి చేసేట్టుగా సంకల్పించుకోవటం. ప్రణాళిక ఎప్పుడైతే అక్షర రూపం దాలుస్తుందో అప్పడవి మార్గదర్శకాలవుతాయి. వాటిని ఎంత వరకు పూర్తి చెయ్యగలిగామన్నది ఎప్పిటికప్పుడు సరిచూసుకుని వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. దీన్నే పెర్ట్ ఛార్ట్ అంటారు. మనం చెయ్యదలచుకున్న పనిని ప్రణాళికాబద్ధం చేసినట్లయితే వాటితో ఏరోజుకారోజు పూర్తి చేసిన పనిత పోల్చి చూసుకుని అవసరమైతే మార్పులు చేర్పులు చేసి అనుకున్న సమయంలో అవగొట్టటం సాధ్యమౌతుంది.
దానితో పాటుగా ప్రణాళికలో ముందు ఇచ్చిన హామీల ఆచరణ, సమర్థ పాలన, రాష్ట్రాలలోని సమస్యల మీద ప్రధానంగా దృష్టి పెట్టటంలాంటి వి కూడా ప్రధానమంత్రి తన మంత్రి వర్గ సభ్యులకు సూచించారు.
అధికారం రాగానే ఏదో గబుక్కున చూపించటానికి చెయ్యటం కాకుండా, ఐదు సంవత్సరాలు ఉన్నాయిలే అని తీరిగ్గానూ కూర్చోకుండా కార్యాలను మొదలుపెట్టి ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్ళటం అనేది ప్రభుత్వానికి చాలా అవసరం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే గబగబా ఏవేవో పనులు చేసి, గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి, మరేదో చెయ్యాలనుకుని ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా దిగిపోవటం చేసిన ఆఆపా కేజ్రీవాల్ లా కాకుండా, మోదీ చేపట్టే పనుల్లో సమర్థత కనిపిస్తోంది.
సముచిత వేగం సరైన విధానం!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more