విద్యుతుద్యోగలు ఆదివారం చేసిన మెరుపు సమ్మెతో అసలే ఎండాకాలం వేడితో బాధపడుతున్న రాష్ట్రవాసులకు పెనం మీదినుంచి ఏకంగా కుంపట్లోకి పోయినట్లే అయింది.
విద్యుతుద్యోగులు పిఆర్ సి ని తక్షణం అమలు చెయ్యాలని కోరుతూ ఆదివారం మెరుపు సమ్మెకు దిగారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు ఆదివారం అర్థరాత్రి వరకు చేసిన సంప్రదింపులు విఫలమయ్యాయి. పిఆర్ సి ని ఇవ్వలేని పక్షంలో మధ్యంతర భృతిని విడుదల చెయ్యాలని విద్యుత్ ఐకాస పట్టుబట్టటంతో ట్రాన్స్ కో సిఎండీ సురేశ్ చందా, జెన్ కో ఎండీ విజయానంద్ గవర్నర్ ని సంప్రదించారు. వేతన సవరణలో భాగంగా ఉద్యోగులకు27.5% మధ్యంతర భృతిగా విడుదల చెయ్యాలని గవర్నర నరసింహన్ నిర్ణయించారు. ఈ విషయాన్ని జెఎసి కి చేరవేయగా, వాళ్ళు కనీసం 30% మధ్యంతర భృతిని విడుదల చెయ్యాలని, లేదంటే సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు.
ఈరోజు ఉదయం 11.00 గంటలకు మరోసారి చర్చలు జరుగనున్నాయి.
అయితే రాష్ట్రపతి పాలనలో ఉన్న సందర్భంగా సమ్మెలు సరికాదని, రాష్ట్రపతి వరకు వెళ్ళి కేసులలో చిక్కుకున్నట్లయితే పరిస్థితి బాగుండదని కొందరు సూచిస్తూ సమ్మెను విరమిద్దామని కూడా అనుకుంటున్నారు.
ఈ లోపులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు కాబోయే ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ సమ్మె విరమించవలసిందిగా ఉద్యోగ సంఘాలను కోరారు.
వేతన సవరణ ఏప్రిల్ నుంచే అమలు లో ఉంటుందని, ఆ విషయంలో ఆదుర్దా పడవలసిన అవసరం లేదని, ప్రధాన కార్యదర్శి పి కె మొహంతి అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more