ఆఖరు బంతి వరకు పోరాడే లక్షణమున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రాజమండ్రిలో జరిగిన జైసమైక్యాంధ్ర సభలో రాష్ట్ర విభజన ఇంకా పూర్తి కాలేదని అన్నారు. ఎందుకంటే సుప్రీం కోర్టులో పిటిషన్ తీసుకోబడిందని, దాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపించారని, అందువలన ప్రాతిపదికే లేని రాష్ట్ర విభజన నిర్ణయం చేసిన కేంద్రప్రభుత్వం చర్యకు విలువలేదని అన్నారాయన.
కిరణ్ కుమార్ మాట్లాడటానికి ముందు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇదే మాటను చెప్పారు. సుప్రీం కోర్టు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్ ను ఆమోదించటం మొదటిసారి జరిగిందని, దాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపించటం శుభసూచకమని అన్నారు. కిరణ్ కుమార్ సీమాంధ్రకు ముఖ్యమంత్రి అవటం కోసం తన పదవికి రాజీనామా చెయ్యలేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం కోసమే ఆయన ప్రయత్నమని ఉండవల్లి అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా రాష్ట్ర విభజనకు కారకులు రాష్ట్రంలో పెదబాబు, చినబాబు, కేంద్రంలో పెద్దమ్మ చిన్నమ్మ అని అన్నారు. పెదబాబు చంద్రబాబు నాయుడు, చినబాబు జగన్, పెద్దమ్మ సోనియా గాంధీ, చిన్నమ్మ సుష్మాస్వరాజ్ గా కిరణ్ కుమార్ అభివర్ణించారు.
శాసనసభలో తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టటం సరికాదని, అసెంబ్లీలో కూడా బిల్లును ఆమోదించిన తర్వాతనే పార్లమెంటులో ప్రవేశపెట్టమని సుప్రీం కోర్టు ఆదేశిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు కిరణ్ కుమార్.
పిచ్చి తుగ్లక్ లలాగా ఢిల్లీ పెద్దలు పార్లమెంటులో హడావిడిగా బిల్లును పాస్ చేసి అ తర్వాత ఒకరోజులోనే క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించి అందులో సవరణలను ఆర్డినెన్స్ రూపంలో పాస్ చెయ్యటమేమిటని కిరణ్ కుమార్ విమర్శించారు.
చంద్రబాబు, జగన్ వాళ్ళ పార్టీలకు వాళ్ళే రాజులని, వాళ్ళు తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించేవారు వారి పార్టీలో ఉండరని అయినా వాళ్ళు నాటకాలాడారని, కానీ తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలో అతి చిన్న కార్యకర్తనని, అందువలన పోరాడినా రాష్ట్ర విభజనను ఆపలేకపోయానని కిరణ్ కుమార్ అన్నారు.
కెసిఆర్ గురించి మాట్లాడుతూ కిరాయి మనుషులకోసం సొంత మనుషులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి చివరకు ఆ కిరాయి మనిషి పంగనామాలు పెట్టాడని అన్నారు.
చివరగా, 25 ఎంపీ సీట్లలోనూ సమైక్యాంధ్రను గెలిపించండి, రాష్ట్రం ఎందుకు సమైక్యంగా ఉండదో నేను చూస్తానన్నారు కిరణ్ కుమార్ రెడ్డి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more