రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందింది. బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఓటింగ్ జరపాలని విపక్ష నేతలు పట్టుబడినప్పటికీ, డిప్యూటీ స్పీకర్ కురియన్ మూజువాణి ఓటుకే మొగ్గుచూపారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ ముగిసిందని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు. బిల్లుకు సవరణ ప్రతిపాదనను బీజేపీ ఎంపీ వెంకయ్యనాయుడు ప్రవేశపెట్టారు. అయితే, వెంకయ్యనాయుడు సవరణ ప్రతిపాదన వీగిపోయినట్లు డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించారు. సవరణలపై మూజువాణి ఓటింగ్ ను డిప్యూటీ ఛైర్మన్ కురియన్ నిర్వహించారు
ప్రధాని హామీలు
సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రధాని మన్మోహన్ తెలిపారు. హైదరాబాదు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రధానిపై పేపర్లు చింపి వేస్తున్న విపక్ష సభ్యులు.
ఓటింగ్
సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై ప్రస్తుతం ఓటింగ్ జరపటం జరిగింది. అయితే, మూజువాణి పద్దతిలోనే ఓటింగ్ జరుగుతోంది. పదేళ్ల పాటు సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించాలన్న వెంకయ్యనాయుడు ప్రతిపాదన సభలో వీగిపోయింది. కేవలం ఐదేళ్ల పాటే ప్రత్యేక హోదా ఉంటుందని తీర్మానించారు.
రాష్ట్రపతికి చేరనున్న తెలంగాణ రాష్ట్ర బిల్లు
పార్లమెంటు ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. మంగళవారం నాడు లోక్ సభలో పాసైన టీబిల్లు, ఈ రోజు రాజ్యసభలో కూడా పాస్ అయింది. ఇరు సభల్లో ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. . బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయంగానే... మన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more