800 transfers from delhi jal board

800 transfers from Delhi Jal Board, Aam Admi Party, Arvind Kejriwal, Jal board employees suspended, Delhi PWD Minister Sisodia

800 transfers from Delhi Jal Board

ఢిల్లీ జల్ బోర్డ్ లోని 800 మంది ఉద్యోగుల మీద వేటు

Posted: 01/07/2014 11:48 AM IST
800 transfers from delhi jal board

అవినీతి మీద కొరడా ఝళిపించే వాగ్దానం చేసిన ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ జల్ మండల్ లో ముగ్గురిని సస్పెండ్ చేసి 800 మందిని బదిలీ చేయించారు. 

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే కేజ్రీవాల్ అవినీతిని రూపుమాపుతామని చెప్తూ ఎవరైనా లంచమడిగితే కాదనకండి కాని మాకు తెలియజేయండి వాళ్ళని పట్టుకుంటామని అన్నారు.  అలాగే ఒక టివి ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో బయటపడ్డ ఛీఫ్ వాటర్ అనలిస్ట్ వినోద్ కుమార్, పట్వారీ సునీల్ కుమార్. మీటర్ రీడర్ అతుల్ ప్రకాశ్ లను ముఖ్యమంత్రి ఆదేశాలతో సస్పెండ్ చేసారు. 

పిడబ్యుడి మంత్రి సిసోడియా మాట్లాడుతూ అవనీతి, లంచగొండితనానికి కాలం చెల్లిపోయిందన్న సంకేతాన్ని చాలా బలంగా ఇచ్చాం.  రాజకీయ విధానంల ప్రక్షాళన తీసుకొస్తున్నాం.  ఈ సస్పెన్షన్ అందరికీ కనువిప్పవుతుందని ఆశిస్తున్నాం అన్నారు.  ఆ ముగ్గురి మీదా కేసులు బుక్ చేస్తున్నామని కూడా సిసోడియా అన్నారు. 

800 మంది ఉద్యోగులను బదిలీ చెయ్యటమనేది ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న అతి పెద్ద చర్య. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles