Aap loksabha poll preparations

aap loksabha poll preparations, Arvind kejriwal, Aam Admi Party, Loksabha 2014 preparations,AAP convenor Arvind Kejriwal

aap loksabha poll preparations

అరవింద్ కేజ్రీవాల్ ని ప్రధానిగా చూడటమే లక్ష్యం- ఆప్ నేత

Posted: 01/04/2014 04:49 PM IST
Aap loksabha poll preparations

ఢిల్లీ లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎన్నికలకు సిద్ధమౌతోంది.  నాలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలకు ఇప్పటికే సిద్ధమైంది ఆప్.   లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను తయారు చెయ్యటం కోసం ముందుగా జాతీయ సమావేశం ఈ రోజు జరిగింది. 

దానికి హాజరవటానికి ముందు ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ లోకసభ పోటీకి అవసరమైన వ్యూహాన్ని తయారుచేస్తున్నామని అన్నారు.  అభ్యర్థుల పేర్లు 10, 15 రోజుల్లో ఖరారు కావచ్చని తెలియజేసారు.  ఈ సందర్భంలో మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలకంటే భేషైన నాయకుల అవసరం ఉందని అన్నారు.  ప్రధాని పదవిలో అంతకంటే యోగ్యులు ఉండటం దేశానికి ఎంతో అవసరమని చెప్పారు.  వాళ్ళిద్దరి మధ్యా వాగ్వివాదం పోటీలు ఇవన్నీ వ్యర్థమైన విషయాలని అన్నారాయన. 

28 మంది సభ్యుల ఆప్ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఢిల్లీ కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో జరిగింది.  ఇది మొదటి సమావేశమని, లోగడ ఢిల్లీలో జరిగిన ఎన్నికలలో తీసుకున్న చర్యలను దృష్టిలో పెట్టుకుని, వాటిని దేశ పరిధిలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటమే సమావేశం లక్ష్యమని ఆప్ నాయకుడు యోగేంద్ర యాదవ్ అన్నారు. 

గుజరాత్ లోని అన్ని సీట్లకూ, హర్యానా ఉత్తర ప్రదేశ్ లలోనూ పోటీ చెయ్యటానికి ఆప్ ఇప్పటికే నిర్ణయం తీసుకోవటం జరిగింది.  ఢిల్లీ తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఆప్ ప్రతినిధులు కూడా ఈరోజు సమావేశంలో పాల్గొన్నారు. 

మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, అరవింద్ కేజ్రీవాల్ ని ప్రధాన మంత్రిగా చూడటమే లక్ష్యమని ఆప్ సీనియర్ నాయకుడు ఒకాయన అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles