సరిగ్గా శాసన సభలో బిల్లు చర్చకు వచ్చే సమయానికి తెలంగాణాకు చెందిన శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధరబాబుని తప్పించటం, ఆ స్థానంలో సమైక్యాంధ్రాకు మద్దతుగా నిలిచిన శైలజానాథ్ కి ఆ శాఖను అప్పగించటం పై ఆగ్రహించిన శ్రీధరబాబు ఎవరు ఎంత వారించినా వినకుండా రాజీనామా చెయ్యటం మీద రాజకీయ రంగంలో సంచలనం రేగింది. ముఖ్యమంత్రి చేసింది తప్పని, కాదని, తెలంగాణాకు ద్రోహం చేసే బుద్ధితోనే ఆ పని చేసారని, బిల్లు మీద చర్చ జరగకుండా చేసే ప్రయత్నమే తప్ప మరేమీ కాదని, శ్రీధరబాబు రాజీనామా చెయ్యటం అనవసరమని ఇలా వివిధ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం చాలా కూల్ గా ఉన్నారు. శ్రీధరబాబు రాజీనామాని చాలా లైట్ గా తీసుకుంటున్నారు. ఈరోజు సభాపతి నాదెండ్ల మనోహర్ తో భేటీ అయిన శ్రీధరబాబు తన రాజీనామా చర్య అహంకారం కాదు ఆత్మాభిమానమని అన్నారు. రాజీనామా ఆమోదిస్తారో చెత్త కుండీలో వేస్తారో వాళ్ళిష్టం అని కూడాఆయన చెప్తూ. మంత్రిగా విధులకు హాజరవనని, విషయమంతా ఎఐసిసి కి ఫిర్యాదు చేసానని అన్నారు.
అయితే ఇదంతా పెద్ద డ్రామా అవటానికి కూడా అవకాశం ఉంది.
అధిష్టానానికి వ్యతరేకంగా గళం విప్పి సమైక్యాంధ్రకు వెన్నుకాస్తున్నట్టుగా చెప్తూ, బిల్లుని అడ్డుకుంటానని చెప్తూ వస్తున్న కిరణ్ కుమార్ తీరా ఆ బిల్లు అసెంబ్లీకి వచ్చేంతవరకూ ఏమీ చెయ్యకపోవటంతో సీమాంధ్రలో ఆయన మాటల మీద నమ్మకం తగ్గిపోతున్న సమయంలో ఉన్నట్టుండి శాసనసభ వ్యవహారాలనుంచి శ్రీధరబాబుని తప్పించటంతో తెలంగాణా నాయకులంతా ఎలుగెత్తి ఆయనను విమర్శించారు. అవన్నీ కిరణ్ కుమార్ కి సీమాంధ్రలో పరపతి దృష్ట్యా దీవెనలే మరి.
అలాగే రాజీనామా చేసి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడుతూ అన్ని పార్టీలనూ సమన్వయపరచే కార్యభారాన్ని తన భుజాలమీదకు తీసుకుని ఒక్కసారిగా తెలంగాణాలో హీరో అయిపోయారు.
ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కావాలనే ఇరు ప్రాంతాలలో ప్రాబల్యం కోసం ఆలా చేయిస్తుందా అన్నట్లుంది. దీనితో విశ్వాసపాత్రుడైన శ్రీధరబాబుని పెద్ద నాయకుడిగా చేసి తెలంగాణాలో తెరాసా ప్రాబల్యాన్ని కూడా తగ్గించటానికి బీజం వెయ్యటం జరుగుతోందని పెద్ద అనుమానం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more