Cm kiran attending for gom

cm kiran Attending for GOM, CM Kiran Kumar reddy, Congress party, ap bifurcation, telangana issue, samaikyandhra, cm kiran rachabanda,

cm kiran Attending for GOM

జీవోఎంకు వెళ్తా..కానీ అక్కడ మాత్రం?

Posted: 11/16/2013 03:13 PM IST
Cm kiran attending for gom

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈనెల 18 జీవోఎం ముందుకు వెళ్లటానికి రెఢీ అవుతున్నారు. కేంద్ర మంత్రుల బృందం ఈనెల 18న నిర్వహించే సమావేశానికి వెళ్తానని, అక్కడ సమైక్యవాదాన్ని వినిపిస్తానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే శ్రీశైలం ప్రాజెక్టు ఎవరిదవుతుందని, విభజన జరిగితే తెలంగాణకే ఎక్కువ నష్టమని కిరణ్‌ చెప్పారు.

 

రాష్ట్రం విడిపోతే కొత్త ప్రాజెక్టులు కట్టలేమన్నారు. రాష్ట్రవిభజన కంటే ముందే ప్రాజెక్టులను ఎలా విడగొడతారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.సమైక్యరాష్ట్రంలో లేకుంటే ఇన్ని ప్రాజెక్టులు నిర్మాణం సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు.

 

సమైక్యనినాదం ఢిల్లీకి విన్పించేలా చేతులెత్తి చెప్పాలని సిఎం కోరగా, సభకు హాజరయినవారంతా చేతులెత్తడం విశేషం. తెలంగాణలో ప్రాజెక్టులకు విద్యుత్ ఉత్పాదన కోసం రూ.40వేల కోట్లు ఖర్చు అవుతుందని, ఉద్యోగుల జీతాలకు రూ.5వేల కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles