Kiran talks tough ahead of meeting with gom

telangana agitation, seemandhra agitation, gom meeting, kiran kumar reddy, T.congress Central ministers, jaipal reddy

T.congress Central ministers meeting with GoM, Hyderabad main topic.

జీఓఎంతో నేడు నేతల కీలక భేటీ

Posted: 11/18/2013 09:14 AM IST
Kiran talks tough ahead of meeting with gom

రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి కేంద్రం సూపర్ ఫాస్ట్ వేగంతో ముందుకు వెళుతుంది. ఇందులో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం రాష్ట్రంలోని వివిధ పార్టీల అభిప్రాయాలను సేకరించి ఓ దఫా చర్చలు కూడా జరిపి విభన అంశం పై నివేదిక రూపొందించడానికి అంతా సిద్ధం  చేసుకుంది.

ఈనెల 20వ తేదిన విభజన అంశానికి సంబంధించిన కేబినెట్ నోట్ ను కేంద్రానికి సమర్పించే ముందు తుది దఫా చర్చలకు నేడు శ్రీకారం చుట్టారు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ కేంద్రమంత్రులు 10 గంటలకు సర్వేసత్యనారాయణ, బలరాం నాయక్ లు కేంద్ర బృందం ముందుకు వెళ్లి నిన్న తెలంగాణ మంత్రులు జైపాల్ రెడ్డి నివాసంలో సమావేశం అయి చర్చించి 11 విధివిధానాల తీసుకున్న తుది నిర్ణయాల నివేధికను సమర్పించనున్నారు. మరో వైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి మంత్రుల బృందం ముందుకు వెళ్లబోతున్నారు.

అక్కడ ఆయన తన సమైక్యవాణిని వినిపించబోతున్నారు. తెలంగాణ మంత్రులతో, ముఖ్యమంత్రితో జీఓఎం విడివిడిగా చర్చలు జరపనుంది. మొత్తానికి నేడు జరిగే భేటీ విభజన ప్రక్రియలో కీలక భేటీ కాబోతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles