ఇస్రో శాస్త్రవేత్తల కలల ప్రయోగం మరికొన్ని గంటల్లో కార్యరూపం దాల్చబోతోంది. అన్ని పరీక్షలూ పూర్తయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు మంగళ్యాన్ అంగారక గ్రహంపైకి దూసుకెళ్లనుంది. అంగారక గ్రహం గురించి అన్వేషణ కోసం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 'మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉప్రగహాన్ని మోసుకొని భూ కక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ ఎల్ వీ-సి 25) శ్రీహరి కోటలోని షార్ ప్రయోగవేదికపై సిద్ధంగా ఉంది. . మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి శాస్త్రవేత్తలు కౌంట్ డౌన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. పీఎస్ ఎల్ వీలో ఘన, ద్రవ ఇంధనాన్ని నింపారు. ప్రయోగానికి ముందుగా ఐదుసార్లు ఆకాశంలోకి బెలూన్ లను వదిలి గాలివాటాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సూపర్ కంప్యూటర్ ఆదీనంలోకి రాకెట్ వెళ్తుంది. ప్రయోగం చివరి పది నిమిషాల్లో అన్నీ వ్యవస్థలను పరీక్షించి రాకెట్ ను నింగిలోకి పంపుతారు.
సెప్టెంబర్ 24, 2014 వరకు కక్ష్యలోనే మామ్
మంగళ్యాన్ టేకాఫ్కు సిద్ధంగా ఉంది. 1.35 టన్నుల బరువు గల ఈ ఉపగ్రహం రిఫ్రిజిరేటర్ సైజులో ఉంది. బంగారు కవర్తో కప్పి ఉంచిన మంగళ్యాన్ను 45 మీటర్ల పొడవైన పిఎస్ఎల్వి-సి25 రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. భూమిపై నుంచి దూసుకెళ్లిన 40 నిమిషాల్లో భూ కక్ష్యలోకి చేరుతుంది. దాదాపు నెల రోజుల పాటు భూ కక్ష్యలో తిరుగుతూ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించేందుకు అవసరమైన శక్తిని కూడగట్టుకుంటుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 24న రెడ్ ప్లానెట్ కక్ష్యలోకి చేరుకుంటుంది.
మార్స్పై మానవ మనుగడపై పరిశోధనలు
మంగళ్యాన్ అంగారక గ్రహంపై చిత్రాలను తీస్తుంది. అక్కడ నివసించేందుకు గల అవకాశాలనూ పరిశోధిస్తుంది. ఇస్రో చేపట్టిన ఈ కలల ప్రాజెక్టు భారీ రిస్క్తో కూడినదని ఆ సంస్థ ఛైర్మన్ రాధాకృష్ణన్ అన్నారు. మంగళ్యాన్ ప్రయోగాన్ని సక్సెస్ చేయడం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సత్తాను ప్రపంచానికి చాటాలన్నదే ఇస్రో ప్రధాన ఉద్దేశ్యమంటున్నారు. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో మార్స్పై మరిన్ని ప్రయోగాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇటలీకి చెందిన వ్యోమగామి గెలీలియో నాలుగు శతాబ్దాల క్రితం టెలిస్కోప్ను కనుక్కున్నారు. ఆ టెలిస్కోప్ ఆధారంగానే ఇతర గ్రహాలతో పాటు అంగారకుడ్ని కూడా గుర్తించారు. దానిపై పరిశోధనలూ అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. రెడ్ ప్లానెట్పై పరిశోధనల్లో అమెరికా అందరికంటే ముందుంది. మార్స్పైకి ఉపగ్రహాలను, పరిశోధక నౌకలను, రోవర్లను పంపించింది. రష్యా, జపాన్ కూడా మార్స్పై ప్రయోగాలు చేసినా.. సక్సెస్ రేటు అంతగా లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more