ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ రేపటి నుండి ప్రజల పై ఛార్జీల మోత మోగించబోతుంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీని సీమాంధ్రలో ఉద్యమం అంటూ దాదాపు రెండు నెలల పాటు బస్సులను నిలిపివేసి దాదాపు 745 కోట్ల నష్టాన్ని తేవడంతో ఇప్పుడు తెలంగాణ, సీమాంధ్ర ప్రజల పై ఛార్జీల భారం పడబోతుంది. పెరిగిన డీజిల్ రేట్లు, సీమాంధ్ర ఉద్యమం ఎఫెక్టుతో దాదాపు 10 శాతం ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ పెంపుతో సుమారు 400 కోట్ల రూపాయల భారం పడబోతుంది. ఈ ఛార్జీల పెంపు రేపు అర్థరాత్రి నుండి అమల్లోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ బస్సులపై 12 శాతం, సూపర్ లగ్జరీ బస్సులపై 10 శాతం, పల్లె వెలుగు బస్సులపై 8 శాతం చార్జీలను అధికం చేయనున్నారు. మన ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమో, సీమాంధ్రుల ఉద్యమమో కానీ దీనివల్ల సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారనేది మాత్రం నిజం.
అయితే ప్రతి పక్షాలు మాత్రం ఆర్టీసీ నష్టాలకు కారణం ప్రభుత్వ విధానాలేనని, సంస్థ లాభాల్లో ఉండేటట్లు చర్యలు మాత్రం తీసుకోరని, వెంటనే పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెరిగిన బస్సు చార్జీల వల్ల ఆర్టీసీకి ప్రయాణీకుడు దూరం అయ్యే సూచనలున్నాయని పలువురు అంటున్నా ఆర్టీసీ అధికారులు మాత్రం తన పని తాము చేసుకొని పోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more