రేపు జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటుందనే వార్తలు వెలువడిన తరుణంలో మళ్లీ సీమాంధ్ర నేతలు నాటకాల ‘రాజీ డ్రామాలు ’ మొదలు పెట్టారు. గతంలో కూడా డిసెంబర్ 9 ప్రకటన తరువాత ఇలానే చేయడంతో అధిష్టానం ఆ నిర్ణయం పై వెనక్కి తగ్గింది. ఇప్పుడు మళ్లీ సమైక్య రాష్ట్రం కోరుతూ రాజీనామాలకు తెర తీశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి సమైక్య రాష్ట్రం కోరుతూ తన పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయనతో పోటీగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడుగురు రాజీనామా చేశారు . ఈ రాజీనామాల పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి మండి పడ్డారు. సీమాంధ్ర ఎమ్మల్యేలవి రాజీనామా డ్రామాలని తెలంగాణ రాష్ట్ర సమితి మండి పడింది.తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో సీమాంధ్ర నేతలు మరోసారి రాజీనామాల డ్రామాకు తెరదీశారని టిఆర్ఎస్ నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు విమర్శించారు. సీఎం కిరణ్తో సహా సీమాంధ్ర మంత్రులు తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు దిక్కార స్వరాన్ని అధిష్టానం నియంత్రించాలని, రెండువేల తొమ్మిది డిసెంబరు తొమ్మిదిన తెలంగాణ ప్రకటన చేసినప్పుడు పార్టీ గీత దాటినవారిపై వేటు వేసి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more