బీహార్ లో మధ్యాహ్న భోజనం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సరన్ జిల్లాలో దహ్రమసాటి గందవాన్ అనే గ్రామంలో నిన్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద వడ్డించిన ఆహారం తిని 20 మంది పిల్లలు మరణించారు. న్నం, పప్పులు, సోయాబీన్తో కలిపి వండిన కిచిడీని తిన్న వెంటనే పిల్లలందరూ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో హుటాహుటిన దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా లాభం లేకపోయింది. ఇప్పటికే 20 మంది మరణించగా మరో 5 గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారి ఒకరు చెప్పారు. ఫోరెన్సింగ్ ల్యాబ్ బృందం దర్యాప్తుకు సహకరిస్తుందని, శరన్ డివిజనల్ కమిషనర్, డిఐజి సంయుక్తంగా ఈ దర్యాప్తు నిర్వహిస్తారని వారు చెప్పారు. అంతేకాకుండా మృతి చెందిన పిల్లల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఈ సంఘటన పై అక్కడి ప్రతి పక్షాలు నితీష్ కుమార్ ప్రభుత్వంపై మండి పడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more