Jaipal digvijay meet on t issue

Jaipal Digvijay meet, Congress Working Committee, Telangana statehood, Rayala Telangana, Jana Reddy, Damodara Raja Narasimha,

jaipal digvijay meet on t issue

తెలంగాణా నాయకుల్లో ఉత్సాహం

Posted: 07/16/2013 11:07 AM IST
Jaipal digvijay meet on t issue

కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి రాష్ట్ర ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయిన విషయం తెలంగాణా విషయంలో కేంద్రం ఏదో ఒక నిర్ణయానికి వద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలియజేస్తోంది.  

రాష్ట్ర విభజన విషయంలో దిగ్విజయ్ సింగ్ వచ్చిన తర్వాత పావులు చకచకా కదులుతున్నాయనే మాట వినపడుతోంది.  కాకపోతే ఎవరు మాట్లాడినా అది పైనుంచి వచ్చేదే కాబట్టి దిగ్విజయ్ సింగ్ స్థానంలో మరొకరున్నా జరిగేది అదే అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.  

నిన్న ఏకంగా 40 నిమిషాల పాటు వారిరువురి మధ్య జరిగిన చర్చల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటి గురించి చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది.  అందులో సిడబ్ల్యుసి ఎప్పడు నిర్వహించాలి, అందులో రాష్ట్ర విభజన విషయం అజెండా లో ఎలా పొందుపరచాలి అన్న దిశగా చర్చలు సాగాయని సమాచారం.  రాయల తెలంగాణా సంభవమేనా అందులో ఎలాంటి సమస్యలున్నాయన్నది కూడా మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇంతవరకూ అంటీముట్టనట్టుగా ఉన్న జైపాల్ రెడ్డి ఒక్కసారిగా తెలంగాణా విషయంలో జోక్యం చేసుకుని దిగ్విజయ్ సింగ్ తో మాట్లాడటం, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ, మంత్రి జానారెడ్డిలతో సుదీర్ఘంగా ఫోన్ లో మాట్లాడటం మీద రాజకీయ వర్గాల్లో అంచనాలు పెరిగిపోయాయి.  బహుశా పార్లమెంటు వర్షాకాలం సమావేశాల వరకు రాష్ట్ర విభజన అంశాన్ని ప్రతిపాదించటానికి అవకాశం ఉందన్న నమ్మకం రాజకీయ రంగంలో ప్రబలంగా ఉంది.  

ఏది ఎలా జరిగినా, దిగ్విజయ్ సింగ్ చెప్పిన ఆ తీపి కబురు ఎప్పుడు వినిపిస్తుందా అని తెలంగాణా వాదులంతా ఎదురుచూస్తున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles