తెలంగాణా రాష్ట్రసమితి ఈరోజు హైద్రాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసింది. ముఖ్యంగా ఈ సభ పార్టీలో చేరబోతున్న ఇతర పార్టీలలోని నాయకులకోసం ఏర్పాటైంది.
పార్టీలో చేరబోతున్న ముఖ్యనాయకులు- పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు వివేక, ఆయన తమ్ముడు వినోద్, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాధరావు, మాజీ పిసిసి అధ్యక్షుడు కె.కేశవరావు.
తెలుగుదేశం నాగర్ కర్నూల్ ఇన్ఛార్జ్ మర్రి జగన్నాధరెడ్డి కూడా తెరాసలో చేరబోతున్నారు.
ఇంకా తెరాసలో చేరబోతున్న నాయకులు- మెదక్ మాజీ పార్లమెంట్ సభ్యుడు మాణిక్యరెడ్డి, తెలంగాణా వైద్యుల ఐకాస నేత డాక్టర్ బూర నరసింహ గౌడ్, భువనగిరికి చెందిన వెంకట గౌడ్, హైద్రాబాద్ అంబర్ పేటకు చెందిన గుత్తేదార్ సుధాకర రెడ్డి.
భారీగా జరుగుతున్న ఏర్పాట్లతో బహిరంగ సభ వేదిక కళకళ్ళాడుతోంది. పార్టీలోకి అడుగుపెడుతున్న కొత్త నాయకులను వారి మద్దతుదారులతోపాటుగా ఆహ్వానించటం, పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా మాట్లాడటమే లక్ష్యంగా ఈ బహిరంగ సభ ఏర్పటైంది.
తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఎంతో చాకచక్యంతో ప్రణాళికాబద్ధంగా ఇతర పార్టీల నుంచి నాయకులను తన పార్టీలోకి రప్పించగలిగారు. అందుకోసం పదవులను కూడా త్యాగం చెయ్యవలసి వచ్చింది. ఆయన ఎర చూపించిన పదవులకోసం పార్టీలను వదిలిపెట్టారంటే అందుకు కారణం రాజకీయాలను సంపాదనకోసం పనిచేసే వృత్తిగా భావించటమే. వృత్తి పరంగా ఎదగాలనుకునేవారు తమకు ఎదిగే అవకాశాలు ఎక్కడ లభిస్తే అక్కడకు చేరుకుంటారన్న విషయాన్ని బాగా కనిపెట్టిన కెసిఆర్ అటువంటి వారికి తగ్గట్టుగా ఆఫర్లనిచ్చి మరీ తన పార్టీలోకి తీసుకున్నారు. వారికి ఆహ్వానం పలకటమే కాకుండా కెసిఆర్ విజయోత్సాహ వేడుకగా కూడా ఈ వేదిక పనిచేస్తుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more