వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిళ మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర క్రిష్ణా జిల్లాలోని సాగుతుంది. నేటి పాదయాత్రలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, అన్నగారు అయిన పెద్ద ఎన్టీఆర్ సోదరుడు నందమూరి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరు రోడ్డు వద్ద షర్మిలను కలిసి, ఆమెతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ రోజుతో షర్మిళ పాదయాత్ర 108 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా షర్మిళ మాట్లాడుతూ.... . వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే 9 గంటలు విద్యుత్తు ఇవ్వడంతో పాటు 30 కెజీల బియ్యం పథకం అమలు చేసేవారన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా ప్రస్తుత ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేదని ఆమె అన్నారు. ఈ ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేది మరోటి అని షర్మిల అన్నారు. వెంకటేశ్వరరావు షర్మిళతో కలిసి పాదయాత్ర చేయడం హాట్ టాపిక్ గా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more