ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వరుసుగా రెండు సార్లు ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. 2005లో ఓ ప్రార్ధనామందిరం వ్యవహారంలో అసదుద్దీన్, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్లు నాటి మెదక్ జిల్లా కలెక్టర్ అనిల్, జేసీలను దూషించారు. కలెక్టర్ను నెట్టివేశారు. దీనిపై నాడు మెదక్ ఎమ్మార్వో నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కొంతకాలం పాటు అసద్, అక్బరుద్దీన్లు కోర్టుకు హాజరయ్యారు.అనంతరం కోర్టుకు గైర్హాజరు అయ్యారు. దీంతో కోర్టు వారిపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యల అనంతరం ఈ కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. దీంతో నాలుగు రోజుల క్రితం అసదుద్దీన్ సంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. వెంటనే బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కానీ అతడి బెయిల్ను కోర్టు తిరస్కరించింది. అసదుద్దీన్కు 14 రోజుల రిమాండ్ విధించింది. మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో అసదుద్దీన్ను విడుదల చేయాలనికోరుతూ మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్ల బంద్కు ఎంఐఎం కూడా పిలుపునిచ్చింది. పలు అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తిరిగి బెయిల్ కోసం అసదుద్దీన్న్ తరుపు న్యాయవాది రఘునందన్రావు సంగారెడ్డి కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను మన్నించిన కోర్టు అసదుద్దీన్ కు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని షరతులు కూడా విధించింది. రూ.10 వేల చొప్పున ఇద్దరిపూచీకత్తు ఇవ్వాలని కోర్టు అసద్ను ఆదేశించింది. అసద్కు బెయిల్ రావడంతో ఎంఐఎం కార్యకర్తల్లో హర్షతిరేకం వ్యక్తమవుతోంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు అసద్ విడుదలయ్యే అవకాశం ఉంది. బెయిల్ ఆర్డర్ సకాలంలో అందకపోతే, రేపే అసదుద్దీన్ విడుదలవుతారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more