దేశంలో తొమ్మిదేళ్లుగా అధికారం వెలగబెడుతున్న కాంగ్రెస్ పార్టీకి భారత సమైక్యత, సమగ్రత పట్ల ద్రుష్టి లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అడ్డదారుల్లో ఓటు బ్యాంకు రాజకీయాలతో 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. భారత సైనికులను పాకిస్థాన్ వూచకోత కోస్తే.. ఇటీవల జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ మేథోమథనంలో కనీసం చర్చకు రాలేదని ధ్వజమెత్తారు. వందకోట్ల మంది హిందువులపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ యుద్దం ప్రకటిస్తే స్పందించలేదని విమర్శించారు. దేశ ప్రజానీకం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించకుండా బీజేపి, ఆర్ ఎస్ ఎస్ లపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాకుండా తెలంగాణ సమస్యను ఈ నెల 28న కేంద్రం ఒక ప్రకటన చేస్తుందనే నమ్మకంతో అన్ని పార్టీ నాయకులు ఆశగా ఉన్నారు. కానీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై కొన్ని రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. తెలంగాణ నాయకులు మాత్రం ఆజాద్ వ్యాఖ్యలకు అర్థం లేదని అంటున్నారు. బిజేపి పార్టీ నాయకులు మాత్రం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆజాద్ వ్యాఖ్యలు సరికావు అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా తెలంగాణ పై అధికారి ప్రకటన ఇచ్చినందుకు షిండే ను పదవి నుంచి తొలిగించాలని బీజేపి నాయకులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ఆయా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్‑ఎస్‑లపై కేంద్ర హోంమంత్రి షిండే వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఇందిరాపార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షకు దిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, మురళీధర్‑రావు, దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ షిండేను తక్షణమే బర్తరఫ్ చేయాలని, లేకుంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొవాలని సవాల్ విసిరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more