పిల్లలు దేవుడి స్వరూపాలు. ఆ పిల్లల కోసం ఎంతమంది స్త్రీ లు పూజలు, నోములు చేస్తారు. అమ్మతనం కోసం స్త్రీలు పరితపిస్తారు. కన్న బిడ్డ కంటే ఈ లోకంలో అమ్మకు ఏదీ ఎక్కువ కాదు. కానీ హైటెక్ యుగంలో కన్న బిడ్డ కంటే సెల్ పోన్ ముఖ్యం అనే పుణ్య స్త్రీలు ఉన్నారు. కేవలం సెల్ఫోన్, మెమరీ కార్డులు, జీన్స్ వంటి వస్తువులు కొనుక్కునేందుకే ఒడిశాలో ఓ తల్లి 17 నెలల మగబిడ్డను అమ్మేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జైలులో ఉన్న భర్తను విడిపించుకునేందుకు డబ్బు అవసరమై బిడ్డను విక్రయించినట్లు తొలుత బుకాయించిన ఆమె తర్వాత చెప్పిన విషయాలు విని పోలీసులు నిర్ఘాంతపోయారు. ఒడిశాలోని జాజ్పూర్ జిల్లా ముందమల గ్రామానికి చెందిన రాఖీ పాత్రా(20) అనే మహిళ ఓ రిక్షా కార్మికుడితో కలిసి రూ. 5 వేలకే తన మగబిడ్డను విక్రయించింది. సెప్టెంబరు 17న కటక్కు చెందిన వ్యక్తి బిడ్డను కొనుగోలు చేసినట్లు మీడియా కథనాల ద్వారా వెలుగుచూడటంతో ఒరిస్సా హైకోర్టు సూ మోటోగా విచారణ ప్రారంభించి దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో పోలీసులు బాలుడిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమె పిల్లాడిని తీసుకోవడానికి నిరాకరించడంతో శిశు సంక్షేమ కమిటీకి అప్పగించారు. కొనుగోలుచేసిన వస్తువులను బట్టి చూస్తే పేదరికం వల్ల కాకుండా వాటి పట్ల వ్యామోహంతోనే ఆమె బిడ్డను అమ్మినట్లు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more