అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులకు శుభవార్త. వీసా జారీ ప్రక్రియలో ఇబ్బందులను తొలగిస్తూ సరళతరమైన కొత్త వీసా ప్రాసెసింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు అమెరికా దౌత్య కార్యాలయం (ఎంబసీ) ప్రకటించించింది. ఫీజు చెల్లింపు, అపాయింట్మెంట్ షెడ్యూల్ ప్రక్రియను సరళతరం చేసినట్లు తెలిపింది. ఈ నెల 26 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని అమెరికా ఎంబసీకి చెందిన మినిస్టర్ కౌన్సెలర్ (దౌత్య వ్యవహారాలు) జూలియా స్టాన్లీ ప్రకటించారు. వీసా దరఖాస్తుదారులకు ఇకపై ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఈటీఏ-ఆన్లైన్ బ్యాంకింగ్), లేదా మొబైల్ ఫోన్ల ద్వారా ఫీజును చెల్లించవచ్చు. వీసా డాక్యుమెంట్లను దేశం మొత్తం మీద ఉన్న 33 పికప్ కేంద్రాల నుంచి అందుకోవచ్చు.
మొదటిసారిగా వీసా కోసం దరఖాస్తు చేసేవారు తమ అపాయింట్మెంట్ షెడ్యూల్ ఖరారు కోసం ఆన్లైన్లో లేదా ఫోన్ ద్వారా కాల్ సెంటర్ను సంప్రదించొచ్చు. కాల్సెంటర్ ప్రతినిధులు దరఖాస్తుదారుల ప్రశ్నలకు ఇంగ్లిష్తో పాటు హిందీ, పంజాబీ, గుజరాతీ, తెలుగులో సమాధానం ఇచ్చే సదుపాయం ఉంది. వీసా ఫీజును యాక్సిస్, సిటీ బ్యాంక్లకు చెందిన 1,800కు పైగా బ్రాంచీలలో నగదు రూపంలో చెల్లించవచ్చు. తొలిసారి అపాయింట్మెంట్ కోరే వాళ్లు ఆఫ్సైట్ కేంద్రం వద్ద వేలిముద్రల కోసం ఒకటి, ఎంబసీ లేదా కాన్సులేట్స్ వద్ద కాన్సులర్ ఇంటర్వ్యూ కోసం మరొకటి మొత్తం రెండు అపాయింట్మెంట్ల కోసం షెడ్యూల్ ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని, ప్రస్తుత వ్యవస్థతో పోలిస్తే ఇదే ప్రధాన వ్యత్యాసమని కూడా ఆమె వివరించారు. వీసాలను రెన్యువల్ చేసుకునే దరఖాస్తుదారులు ఒకసారికంటే ఎక్కువసార్లు వేలిముద్రలను ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
అర్హులైన వారందరికీ పదేళ్ల వ్యవధికి జారీచేసే బహుళ ప్రవేశ వీసాలను అమెరికా కొనసాగిస్తూనే ఉంటుందని స్టాన్లీ చెప్పారు. భారత్లో యూఎస్ వీసా దరఖాస్తుదారులకు 10 రోజుల కంటే తక్కువ వ్యవధిలో అపాయింట్మెంట్ ఖరారు చేస్తున్నామని, ఇంటర్వ్యూ తర్వాత వారంలోపే వీసాలను చేతికందిస్తామన్నారు. అమెరికా ఎంబసీ ఏటా 7 లక్షల దరఖాస్తులను ప్రాసెస్ చేస్తోందని, ఇందులో అధికసంఖ్యలో దరఖాస్తుదారులు వీసాలను పొందుతున్నారని ఆమె అన్నారు. అమెరికాలో యూనివర్సిటీలు మూతపడుతుండటం వల్ల భారతీయ విద్యార్థులపై ప్రభావం పడుతున్న అంశంపై స్పందిస్తూ... విద్యార్థులు వర్సిటీలను ఎంపిక చేసుకునేందుకు ఎంబసీలోని ఎడ్యుకేషన్ కార్యాలయం సేవలను వినియోగించుకోవాలని స్టాన్లీ సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more