రాను రాను టీడీపీ పార్టీ పరిస్థితి అద్వాన్నంగా తయారవుతుందా ? ప్రజలు టీడీపీ పార్టీ పై పూర్తి విముఖను చూపుతున్నారా అంటే... అవుననే అంటున్నాయి సర్వేలు. తాజాగా ఎన్డీటీవి చేపట్టిన సర్వేలో టీడీపీ కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉన్నదని, రానున్న ఎన్నికల్లో తెలుగు దేశానికి ఒక్క ఎంపీ సీటు అంటే ఒక్కటి కూడా రాదని ఆ సర్వే చెప్పింది. ఈ సర్వే ఫలితాల పై తెలుగు దేశం పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఈ సర్వే ఫలితాల పై ఓ తెలుగు ఛానల్ విశ్లేషణ కార్యక్రమం చేపట్టింది.
ఇందులో పాల్గొన్న తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఎన్డీటీవి సర్వే అంతా తప్పు అని, ఒక్కసీటు అంటే ఒక్కటి రాకుండా ఎలా ఉంటుందని చాలా ఆవేశంగా మాట్లాడారు. ఎన్.డి.టి.వి. యాజమాన్యం సాక్షికి సలహా సేవలందిస్తోందని, అందువల్ల డబ్బు తీసుకుని జగన్ కు అనుకూలంగా సర్వే ఇచ్చిందని ఆరోపించారు.అయితే రేవంత్ రెడ్డి అన్నట్లుగా కొన్ని టీవి ఛానల్స్ రాజకీయ పార్టీలకు కొమ్ముకాస్తాయి. కొన్ని సర్వేలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోతాయి. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఇక్కడ తెలుగు దేశం పై జరిగిన గతంలో సర్వేలు కూడా వైయస్సార్ పార్టీకి అనుకూలంగానే వచ్చాయి. ఆ సర్వేల ఆధారంగా మొన్న ఉప ఎన్నికల ఫలితాలు అటూ ఇటుగా వచ్చాయి. ప్రస్తుత ఫలితాల పైనా టీటీపీ సర్వే చేసిన ఛానళ్ళ పై మండి పడకుండా ఇప్పటికైనా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more