గత కొంతకాలంగా ఊహించిన ఊహాగానాలు నేటితో నిజమయ్యాయి. దివంగత కాంగ్రెస్ నేత పీ. జనార్ధన్ రెడ్డి కూతురు విజయారెడ్డి ఆదివారం మధ్యాహ్నం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోచేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయారెడ్డి వేలాది మంది కార్యకర్తల కోలాహలం మధ్య పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. విజయారెడ్డికి పార్టీనేతలు రోజా, రహ్మన్ లు స్వాగతం పలికి పార్టీ కండువాను కప్పారు. జగన్ నాయకత్వంలో కొత్త రాజకీయాలకు నాంది పలకాలని ఉందని.. అందువల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఆమె చెప్పారు. తన తండ్రికి, వైఎస్ రాజశేఖరెడ్డికి ఎలాంటి శత్రుత్వం లేదని... వారిద్దరి మధ్య ఉన్నది కేవలం అభిప్రాయభేదాలు మాత్రమేనన్నారు. ఇద్దరూ ప్రజా సంక్షేమం కోసం పాటుడినవారేనని కొనియాడారు. తాను జగన్ పార్టీలో చేరుతున్న విషయాన్ని తమ్ముడు, ఎమ్మెల్యే అయిన విష్ణువర్దన్ రెడ్డికి కూడా చెప్పానన్నారు. పార్టీ మారినా తమ్ముడితో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని విజయారెడ్డి స్పష్టం చేశారు. విష్ణు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటంలో తప్పేంటని విజయారెడ్డి ప్రశ్నించారు.
కాగా, వచ్చే ఎన్నికల్లో విజయారెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేయాలన్న ఆలోచనలో ఉన్నారు. పీజేఆర్ నియోజకవర్గం జూబ్లిహిల్స్ ఖైరతాబాద్ గా విడిపోయాయి. జూబ్లిహిల్స్ నుంచి ఆయన కొడుకు విష్ణువర్దన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండగా... ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఇక్కడ దానం నాగేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఆమె పోటీచేయాల్సి వస్తే స్వతంత్ర అభ్యర్థిగా గాని, లేదా ఇతర పార్టీ నుంచి గాని పోటీ చేయాలి. ఈలెక్కన ఆమెకు ఉన్న ఏకైక ఆప్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అందువల్లే ఆమె జగన్ పార్టీలో చేరారనేది విశ్లేషకుల భావన.
...AVNK
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more