తమిళనాడు ఎక్స్ప్రెస్ దుర్ఘటనకు దారితీసిన మిస్టరీ చీకట్లు వీడనున్నాయి. ఈ ఘోరం షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలే దని, బాణాసంచా రసాయనాల మంటలే కారణ మని ఫోరెన్సిక్ నిపుణులు ఒక అంచనాకు వచ్చారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం బాణాసంచా తయా రీలో ఉపయోగించే మండే స్వభావం ఉన్న భాస్వ రం, పొటాషియం వంటి రసాయనాలే మంటలకు కారణమని ఆదివారం తేల్చిచెప్పారు. ఈ రైళ్లో రసాయనాల రవాణ వల్లే ఈ దుర్ఘటన చోటు చేసు కుందనే నిర్ధారణకు వచ్చారు.
ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 మంది మృతిచెందగా, పలువురు క్షత గాత్రులై చెన్నై, నెల్లూరు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇంకా కొన్ని మృతదేహాలు ఎవరివ నేది తేలలేదు. గల్లంతయిన వారి వివరాలు దొరక లేదు. మొత్తం 72 మంది రిజర్వేషన్ బోగిలో ఉండగా, జాబితాలో లేని మరో ముగ్గురు ఇందులో ప్రయాణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ దుర్ఘటన అనంతరం తీవ్రవాద సంస్థలు గానీ, సంఘ విద్రోహశక్తులు కానీ ఇందుకు తామే బాధ్యుల మంటూ ఎటువంటి ప్రకటనలు చేకపోవటంతో అటు అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావించారు. ఫోరెన్సిక్ నిపుణులు గత మూడు రోజులుగా బోగి టిసి, రైల్వేగేట్మెన్, అందులో ప్రయాణించిన వారిని, పలువురు స్థానికులను మొత్తం 70 మందిని విచారించారు.
అంతకుముందు రైల్వే భద్రత దళ కమిషనర్ డి.కె.సింగ్ ఆధ్వర్యంలో బహిరంగ విచారణలో ప్రత్యేకాధికారి ప్రదీప్సింగ్ తదితరులు రసాయనాల కారణంగానే మంటలు చెలరేగినట్లు నిర్థారణకు వచ్చారు. బోగిలోని 52, 53, 54, 55, 56 సీట్ల నుంచే ఈ విస్ఫోటనం జరిగినట్లు ఫోరెన్సిక్ నిపుణులు ఆదివారం తెలిపారు. దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన చిత్ర, సుధీర్లు కూడా రైలు ప్రమాదం జరిగినప్పుడు శబ్ధాలు వినిపించాయని తెలిపారు. ఆ శబ్దాలు బాణాసంచా తయారీలో వాడే సల్ఫర్, పొటాషియం, ఫాస్పరస్ మిశ్రమాలు అయి ఉండవచ్చనే ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఉన్నతాధికారులకు తమ నివేదికను సమర్పించారు. మొత్తమ్మీద ఈ దుర్ఘటనకు బాణా సంచా రసాయనాలే కారణమని పేర్కొన్న అధి కారులు, దీనిపై మరింత లోతుగా పరిశోధన చేస్తు న్నారు. అయితే అంత విస్ఫోటనానికి కారణమైన సామాగ్రి రైల్లో ఉంటే రైల్వే నిఘా విభాగం, పోలీసులు, టిసి తదితర అధికారుల నిర్లక్ష్యంపై మాట్లాడలేదు. అంతేకా కుండా ఇటు దొంగ రవాణ అవుతుండగా, ప్రయాణీకులు సిగరెట్ కాల్చడం వలన జరిగిందా? లేక ఆగంతకులు విద్రోహశక్తులు ఇలా పథకం వేశారా అనేది నిర్థారణ కావలసి ఉంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more