తెలంగాణ లొల్లీతో తెలంగాణ తమ్ముళ్ల మధ్య వాగ్యాద్ధం తారాస్థాయికి చేరింది దీనికి టీఎన్ జీవో మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్ ను తెలంగాణ ప్రాంత ఎంపీలు సన్మానించే సందర్భం వేదికైంది. ఈ కార్యక్రమానికి కేశవరావుతో పాటు మంత్రులు జానారెడ్డి, సారయ్య తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యారు. తెలంగాణ ప్రాంత ఎంపీలుగా తాము ఎన్నో పోరాటాలు చేసామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేశవరావు అన్నారు. తమ చిత్తశుద్దిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. తాము ఏ విధమైన పోరాటం చేయాలనేది ప్రజాసంఘాలు, ఉద్యోగసంఘాలు సూచించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు.
అటు సభలో ఇతర నాయకులు ప్రసంగిస్తున్న సమయంలో మంత్రి జానారెడ్డి జోక్యం చేసుకుని స్వామిగౌడ్ ను అభినందించాలని సూచించారు. తెలంగాణపై ప్రసంగాలు వద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. దీంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున జానారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేకే, పొన్నం జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయించడంలో మంత్రులు ఎందుకు శ్రద్ద వహించడంలేదని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు చేసిన కృషి అభినందనీయమని మంత్రి జానారెడ్డి అన్నారు. తాము కూడా తమ స్థాయిలో తెలంగాణకోసం పోరాడుతున్నామన్నారు. తెలంగాణకోసం తాను చేస్తున్న పోరాటం ఉద్యోగులకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. దీంతో సభలో మరోసారి జానారెడ్డికి వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు. తనకు జరిగిన సన్మానాన్ని తెలంగాణ ప్రాంతానికి జరిగిన సన్మానంగా భావిస్తున్నానని స్వామిగౌడ్ అన్నారు.
గతంలో తెలంగాణ కోసం ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన జానారెడ్డి ఇప్పడు మౌనం వహిస్తున్నందునే ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఇకనైనా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ కలిసిపోరాటం చేయాలని స్వామిగౌడ్ కోరారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more