Telangana issure interrupt locksabha

telangana issure interrupt locksabha

telangana issure interrupt locksabha

7.gif

Posted: 04/30/2012 12:32 PM IST
Telangana issure interrupt locksabha

       లోక్ సభలో తెలంగాణ అంశం మరోసారి మారుమ్రోగుతోంది.  పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ (సోమవారం) ప్రారంభమయిన తరుణంలో లోక్ సభ  తెలంగాణ నినాదాలతో దద్దరిల్లింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, టీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్, విజయశాంతి స్పీకర్ పోడియం ముందు చేరి నినాదాలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
      ls ఇంతలో సుష్మా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని సభ్యులు నిరసనలు తెలుపుతున్నా కాంగ్రెస్‌పార్టీ గాని, స్పీకర్‌గాని ఎందుకు స్పందించడంలేదని ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ ప్రశ్నించారు. డిసెంబర్9, 2009 ప్రకటన తెలంగాణ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని ఆమె ప్రభుత్వాన్నినిలదీశారు. తెలంగాణ సమస్యను తేల్చడం యూపీఏ సర్కార్ తక్షణ బాధ్యత అని ఆమె అన్నారు.
        స్పీకర్ మీరాకుమార్ సర్దిచెప్పడంతో కాంగ్రెస్ ఎంపీలు వెనక్కు తగ్గారు. కేసీఆర్, విజయశాంతి మాత్రం స్పీకర్ పోడియం ముందు బైఠాయించి 'జై తెలంగాణ', 'వుయ్ వాంట్ తెలంగాణ' అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ నినాదాల మధ్యే స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. అనంతరం మళ్లీ రగడ మొదలవటంతో చేసేది లేక స్పీకర్ లోక్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gang rape in vishakha district
Osama had natural viagra to stay young  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles