గత నెల 29న సంగారెడ్డిలో జరిగిన అల్లర్లలో ధ్వంసమై న ఆస్తులను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. మూడు గంటల పాటు జరిగిన జగన్ పర్యటన ఆద్యంతం సెక్యూరిటీ సిబ్బంది హడావిడి అంతా ఇంతా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ జగన్మోహన్రెడ్డి మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిపిన పర్యటనలో.. ఆయన భద్రతా సిబ్బంది దుందుడుకు చేష్టలు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. ఈ తోపులాటతో కంగుతిన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టి జగపతి, పార్టీ జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి దూరంగా ఉండిపోయారు. నిజానికి జగన్ వీరిద్దరినీ వెంటబెట్టుకునే బాధితులను పరామర్శించాల్సి ఉంది. అయితే, తోపులాటల వల్ల వీరు దూరంగా ఉన్నా జగన్ వారిని దగ్గరకు పిలిచే యత్నం చేయలేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు తోసుకుంటూ రావడంతో వారందరిని సెక్యూరిటీ సిబ్బంది ఎడాపెడా తోసేశారు.
ఈ హోటల్లోనే.. తోపులాటల వల్ల కూల్డ్రింక్ సీసాలు పగిలి పలువురికి గాయాలయ్యాయి. జగన్ను చూసేందుకు హోటల్ బయట గుమిగూడిన వారిని సెక్యూరిటీ సిబ్బంది తోసేసుకుంటూ వెళ్లారు. ఇక్కడే ఒక బాలుడి చెంపను సెక్యూరిటీ సిబ్బంది చెళ్లుమనిపించడంతో అతను ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు. ఇక, ఈ పర్యటనను కవర్ చేసేందుకు వెళ్లిన విలేకరులను సైతం జగన్ సెక్యూరిటీ సిబ్బంది వదలలేదు. "ఏమి రాస్తారు? రాయకపోతే ఏమవుతుంది? అంటూ విలేకరులను సైతం తోసేశారు. పాత బస్టాండ్ సమీపంలో ధ్వంసమైన హోటల్ను చూసేందుకు వెళ్లిన జగన్ సంఘటన వివరాల గురించి పావుగంటసేపు అడిగి తెలుసుకున్నారు. కానీ హోటల్లో జరిగిన నష్టాన్ని చూడలేకపోయారు. సెక్యూరిటీ సిబ్బంది హడావిడి చూసి, స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలు లాఠీలకు పని చెప్పారు.
దాంతో పోలీస్ అధికారి ఒకరు జగన్ వద్దకు వెళ్లి ట్రాఫిక్కు ఇబ్బందులవుతున్నాయని, పరామర్శ త్వరగా ముగించండని కోరారు. తాను చూసేందుకు రాలేదని, బాధితుల కష్టాలు వినేందుకు వచ్చానని, ట్రాఫిక్కు ఇబ్బందులవుతే కానీ అంటూ జగన్ తన పర్యటనను కొనసాగించారు. తోపులాటల నేపథ్యంలో.. అదే అదనుగా జేబు దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more