Minister raghuveera reddy

Minister Raghuveera reddy.GIF

Posted: 04/09/2012 08:26 PM IST
Minister raghuveera reddy

నీతి, నిజాయితీ, విశ్వసనీయతలకు తాము నిదర్శనమని గొప్పలు చెప్పకుంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత జగన్ ప్రయత్నిస్తునారని మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి జగన్కి నిజాయితీ, విశ్వసనీయత లేదని మంత్రి రఘువీరా ధ్వజమెత్తారు. అనంతపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడిగా గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్ గుప్త ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రులు రఘువీరారెడ్డి హాజరై మాట్లాడారు.

జగన్ స్థాపించిన పార్టీ పేరు వైఎస్ రాజశేఖరరెడ్డిది కాదన్నారు. వై అంటే యువజన, ఎస్ అంటే శ్రామిక, ఆర్ అంటే రైతు ఈ మూడు అక్షరాలను కలిపి వైఎస్ఆర్‌గా అఫిడవిట్‌లో పొందుపర్చారన్నారు. అయితే బయటకు మాత్రం వైఎస్ఆర్‌పై ప్రజలకున్న సానుభూతిని సొంతం చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఏనాడూ పార్టీ అసలు పేరును ప్రస్తావించలేదన్నారు. కాంగ్రెస్ పెద్దలు తనకు అన్యాయం చేశారని జగన్ ఆరోపిస్తూనే కాంగ్రెస్ పార్టీ పేరును ఏవిధంగా పెట్టుకున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Osd m sarveshwar reddy arrest
Kaleshwar baba gold jewelry missing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles