ఖండేల్ వాల్ కమిటీ సిఫారసులను నిరసిస్తూ రేపు ప్రభుత్వరంగ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించగా బ్యాంక్ వ్యవహారాలను పరిశీలించి వివిధ సంస్కరణలను ప్రతిపాదించిన ఖండేల్ వాల్ కమిటీ సూచనలతో పాటు ఔట్ సోర్సింగ్ విధానాన్ని కూడా బ్యాంక్ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఈ సమ్మెను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అదంతా లాంఛనంగా ప్రభుత్వం చేసే ప్రకటనే కానీ సర్కారు చిత్తశుద్ధి ఇందులో కనపడటం లేదని కార్మిక సంఘలు అంటున్నాయి. ఎలాంటి సమస్యలున్నా చర్చించటానికి సిద్ధమని అంటున్న సర్కారుది చాలా ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమన, ఆ మధ్య జరిగిన భారత కార్మిక సదస్సులో చర్చించే అవకాశం ఉన్నా ప్రభుత్వం అటువంటి ప్రయత్నాలేమీ చెయ్యలేదని, ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి గురదాస్ దాస్ గుప్తా వ్యాఖ్యానించారు.
బ్యాంకింగ్ వ్యవహారాలు లావాదేవీల్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల 87 వేల శాఖల్లో నే 75 శాతం జరుగుతుంది కాబట్టి, భారతీయ స్టేట్ బ్యాంక్ తో పాటు ఇతర బ్యాంకులు కూడా వినియోగదారుల సాధారణ బ్యాంక్ సేవలకు రేపు అంతరాయం కలగవచ్చిని సూచించారు. 11 ప్రధాన కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్న తరుణంలో, సిఐటియు నాయకుడు దీపాంకర్ ముఖర్జీ మాట్లాడుతూ, కార్మికుల కష్టాలను గట్టెక్కించటంలో కార్మిక శాఖ విఫలమవటం వలన ఇది బలహీనమైన శాఖగా పరిగణించవలసి వస్తోందని అన్నారు.
రాష్టంలో చూసుకుంటే ఎక్కువగా ర్యాలీలతోనే ఆందోళన ముగిద్దామని టిఎన్జీవోలు నిర్ణయించగా, దేశవ్యాప్తంగా ముఖ్యంగా న్యూడిల్లీ, కోలకతా లలో బ్యాంక్ లే కాకుండా ప్రభుత్వరంగంలో పనిచేసే పాఠశాలలు, పోస్టల్ సేవలు, పోర్ట్, రవాణా మొదలైన శాఖలన్నిటిలోనూ దేశంలో మొదటిసారిగా కాంగ్రెస్, భాజపా, వామపక్షాలు, ఇలా వివిధ పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు కలిసి సమ్మె చెయ్యబోతున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more