రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటన్న పరిణామాలపై ఐఎఎస్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు తమను బలిపశువులను చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. విచారణలో నిబంధనలు పాటించేలా సిబిఐకి దిశానిర్థేశం చేయాలని వారు ముఖ్యమంత్రి ఎన్. కిరణ్కుమార్రెడ్డిని కలిశారు. ఇదే డిమాండ్తో ప్రధానమంత్రిని కలవాలని ఆలోచిస్తున్నారు. అవసరమైతే ఒక రోజు పెన్డౌన్ చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అమాత్యులకు తెలియకుండా తామేమి నిర్ణయాలు తీసుకోవడం లేదని, అలా తీసుకోవడం కూడా సాధ్యం కాదని వారు ముఖ్యమంత్రికి చెప్పారు. అమాత్యులను కాదని నిర్ణయాలు తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్రెడ్డిని రాష్ట్ర ఐఎఎస్ల సంఘం ఆధ్వర్యంలో 70 మంది అధికార్లు కలిశారు. రాష్ట్రంలో అవినీతి కుంభకోణాలపై సిబిఐ విచారణ జరుగుతున్న తీరుపై సిఎంకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాష్ట్ర ఐఎఎస్ల సంఘం ఉపాధ్యక్షుడు ప్రశాంత్ మహాపాత్రో, ఆ సంఘం కార్యదర్శి రేమండ్ పీటర్ విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ మహాపాత్రో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవలు అందించేందుకు తాము ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిర్భయంగా పనిచేసే వాతావరణాన్ని తమకు కల్పించాలని సిఎంను కోరామన్నారు. పారదర్శకంగా, సమర్థవంతంగా పాలన నడిపించేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాల్లో సిబిఐ అధికారులు తమను నేరదృష్టితో చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి కేవలం అధికారులపైనే సిబిఐ ఎక్కుపెడుతోందన్నారు. విచారణ కోసం మంత్రుల ఇళ్లకు సిబిఐ అధికారులు వెళ్తున్నారని, అదే తమను పిలిపించుకొని విచారణ పేరుతో వేధిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాల్లోనూ తమ పాత్ర చాలా పరిమితమని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పేపర్పై పెట్టడం, సంబంధిత ఫైల్ను పంపే వరకే తమ బాధ్యత ఉంటుందన్నారు. కానీ తమ సంతకాన్ని మాత్రమే సిబిఐ పరిగణనలోకి తీసుకోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. అధికారులపై నేరాన్ని నెట్టివేసే ప్రయత్నం సిబిఐ అధికారులు చేస్తున్నారని తెలిపారు. అధికారులను విచారణ చేసే ముందు సిబిఐ అధికారులు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా విచారణ చేయడం సరైంది కాదని తెలిపారు. ఒకవేళ ఏదైనా అధికారిని విచారించాలనుకుంటే ఆ అధికారి శాఖకు చెందిన సీనియర్ అధికారుల సాక్ష్యంతోనే, వారి కార్యాలయంలోనే విచారణను చేపట్టాలని నిబంధనల్లో ఉందని తెలిపారు. వీటన్నింటిపై అడ్వకేట్ జనరల్, న్యాయశాఖతో చర్చించిన తర్వాత మరో దఫా సమావేశమౌదామని సిఎం తమకు హామీ ఇచ్చినట్లు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more