మార్కెటింగ్ లో ఉండవలసిన లక్షణం మంచి వాగ్ధాటి, సమయస్పూర్తి, వాస్తవాలను తనకు అనుకూలంగా మలచుకోవటం. ఏం మాట్లాడినా, ఏం చేసినా తను అమ్మదలచుకున్న వస్తువు గురించి చెప్పటం, దాని మార్కెట్ ని పెంచటమే లక్ష్యంగా ఉంటుంది.
2008 లో 2 జి స్పెక్ట్రమ్ నియామకాల్లో అప్పటి సమాచార శాఖా మంత్రి ఎ.రాజా ప్రధాన మంత్రి దగ్గర్నుంచి ఎవరి మాటా పట్టించుకోకుండా తన ఇష్టానుసారం తన ఇష్టమొచ్చినవారికి కట్టబెట్టారన్నది అభియోగం. ఆ మురికి తన చేతికి అంటకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తోంది. అయితే నిన్న సుప్రీం కోర్టు లైసెన్స్ లను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుతోనూ, చేసిన వ్యాఖ్యలతోనూ నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇరుకున పడాల్సిన సందర్భం. ప్రధాన మంత్రి, హోం మంత్రిని అందులో దోషిగా నిర్ణయించకపోయినా ప్రభుత్వ విధానాలను తప్పు పట్టిన సుప్రీం కోర్టు ఆ విషయంలో చాలా స్పష్టంగా పిటిషన్ వేసినవారిని అభినందించింది. వారే లేకపోతే అమాయక ప్రజానీకానికి ఇలాంటి కుంభకోణాల సంగతి తెలియనే తెలియకపోవునని వ్యాఖ్యానించింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బే. కానీ అంత పెద్దపార్టీలో ఉన్నవారు సామాన్యులు కారు కదా.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి, తప్పంతటినీ యుపిఏ మీది నుంచి ఎన్ డి ఏ మీదకు నెట్టి వేసిన విధానం వింతగా ఉండి రాజకీయ విమర్శకులను ఔరా అనిపంచేట్టుగా ఉంది. ఎన్ డి ఏ ప్రభుత్వం అవలంబించిన ముందు వచ్చినవారికి ముందు ఇచ్చే విధానం వలనే అంతా జరిగిందట. అదే కొనసాగుతుండటంతో ఎ రాజా ఆ పద్ధతిలోనే ఇచ్చారట. దానికి ప్రధాన మంత్రి వ్యతిరేకించినా సరే, అంతకు ముందున్న ప్రభుత్వం పాటించిన విధానాన్నే ఆయన పాటించారట. ఇదేం హేతువో అర్థం కాక రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. ఇందులో అర్థం కాకపోవటానికేముంది, అధికార ప్రతినిధి అంటేనే మార్కెటింగ్. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి ప్రజల్లో గుడ్ విల్ పెంచటమే వారి పని.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more