జస్టిస్ జిఎస్ సింఘ్పి, జస్టిస్ అశోక్ కుమార్ గంగూలీలో ధర్మాసనం నిన్న 2జి కుంభకోణంమీద ఇచ్చిన 74 అంశాలతో కూడిన ప్రతిష్టాత్మకమైన తీర్పులో కీలకమైన టెలికాం సంస్థలకిచ్చిన లైసెన్స్ లను రద్దు చెయ్యటం మీద ఈ విధంగా వివరించింది.
సంఖ్య 69- ముందు వచ్చినవాళ్ళకే ముందు ఇవ్వటమనేది చాలా దోషపూరితమైన నిర్ణయం. ఇందులో ఎన్నో తప్పులు దొర్లే అవకాశముంది. ప్రజకు చెందిన ఆస్తులను ఈ పద్ధతిలో కేటాయించటం ప్రమాదకరమైనది. ఎవరికైతే ప్రభుత్వ కార్యాలయాల్లో సత్సంబంధాలుంటాయో వారికి ఈ విషయం ముందుగా తెలిసిపోతుంది. దానితో ఆ సంస్థ లేదా వ్యక్తి వెంటనే తన అభ్యర్థనను దాఖలు చేస్తారు. దానితో, అంతకంటే ఎక్కువ ప్రయోజనం గల ప్రతిపాదనలు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. స్పెక్ట్రమ్ లాంటి అరుదైన విషయాలలో ప్రభుత్వం వేలం పద్ధతిలోనే కేటాయింపులను నిర్వహించవలసి వుంటుంది. లేకపోతే జాతీయ సంపదంతా ప్రజాహితం కోరుకోని, రాజ్యాంగం పట్ల గౌరవ మర్యాదలు లేని, అక్రమ సంపాదనే లక్ష్యంగా వర్తించే స్వార్థపరుల చేతుల్లోకి పోయే ప్రమాదముంది.
సంఖ్య 70- సెప్టెంబరు 2007 నుండి మార్చి 2008 మధ్యలో సమాచార శాఖ అధికారులు సమాచార శాఖా మంత్రి ఎ.రాజా ఆధ్వర్యంలో అవలంబించిన విధానం కేవలం పక్షపాత విధానం. ఇది ప్రజాహితంలో నష్టపరచే చర్యే కాకుండా, సమానత్వం అనే సిద్ధాంతానికి కూడా వ్యతిరేకం. కోర్టు ముందు ప్రవేశపెట్టిన ఆధారాలను బట్టి చూస్తే సమాచార శాఖా మంత్రి ప్రభుత్వాదాయానికి గండిపెడుతూ, స్వార్థపూరితంగా తనకి ఇష్టులైన వారికి వారి సంస్థలకు కట్టబెట్టే ఉద్దేశ్యంతోనే ఈ క్రింది చర్యలు తీసుకున్నారు.
సంఖ్య 71- స్పెక్ట్రమ్ కేటాయింపులు నిజాయితీగా జరగలేదని కోర్టు భావిస్తున్న పక్షంలో 2001 నుండి ఇచ్చిన లైసెన్స్ లను రద్దుచేయమని సీనియర్ కౌన్సిల్ శ్రీ హరీష్ సాల్పే సూచన కూడా అంగీకరించే విధంగా లేదు. ఎందుకంటే, 2001 నుండి 24.9.2007 మధ్యలో లైసెన్స్ పొందినవారు ఈ పిటిషన్ లో లేరు, పైగా వారు పొందిన లైసెన్స్ లను ఈ కోర్టు ముందు వ్యతిరేకించలేదు.
సంఖ్య 72- అటర్నీజనరల్, ప్రతివాదుల కౌన్సిల్ ల వాదోపవాదనల వలన ఈ తీర్పులో కోర్టు అత్యంత జాగరూకతను పాటించాలని నిర్ణయించుకున్నదే కానీ, ప్రభుత్వం తీసుకునే ఆర్థికపరమైన నిర్ణయాలలో ఈ కోర్టు నిస్సందేహంగా ఎటువంటి జోక్యం చేసుకోదన్నది నిర్వివాదం. అయితే విస్తృత పరిధిలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణాయలు లోపభూయిష్టమని, ప్రజాప్రయోజనలాకు నష్టం కలుగుతున్నదని కోర్టు ముందుకి వచ్చిన తరుణంలో కోర్టు తనకున్న అధికారాలను ఉపయోగించుకుని దాన్ని సరిచెయ్యటమన్నది అవశ్యకం. దేశ ప్రయోజనం దృష్ట్య ఎవరైనా వ్యాజ్యం వేసినపుడు, ఇటువంటి విషయాల్లో, ప్రజలు విశ్వసించి అధికారాలను చేతిలో పెట్టినవారే చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన సందర్భంలో ప్రజాహితంలో కోర్టు కలుగజేసుకోక తప్పదు.
సంఖ్య 73- దీన్ని ముగింపు తీసుకొచ్చే ముందుగా, పౌరులలో కొందరు విఙానులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వంలో ప్రక్షాళనకోసం, జవాబుదారీ కోసం పాటు పడకపోతే ఇటువంటివి అమాయక జనుల దృష్టికే రావని చెప్పక తప్పదు. అదే లేకపోతే, రక్షణశాఖకు చెందిన ఈ అరుదైన అంశాన్ని కొందరు ధనబలంతో ప్రభుత్వ శాఖలను గుప్పిటిలో పెట్టుకుని ఇలా వాటిని చేజిక్కించుకుంటారని తెలిసేది కాదు.
సంఖ్య 74- ఈ పిటిషన్ ని సమ్మతిస్తూ ఈ క్రింది తీర్పులు ఇవ్వటం జరిగింది-
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more