ఈ రోజు రిపబ్లిక్ డే. తెలుగు చెప్పాలంటే గణతంత్రదినోత్సవం. మనలో చాలామందికి స్వాతంత్ర్య దినోత్సవానికి , గణతంత్ర దినోత్సవానికి తేడా ఏమిటనే సందేహం కలుగుతుంది. అందుకే దీని గురించి మనం తెలుసుకుందాం.
సుదీర్ఘ కాలంపాటు భారతేదేశం బ్రిటిష్ పాలనలో మగ్గిపోయింది. బ్రిటిష్ వారు చేసిన చట్టాలే ఆ కాలంలో అమలయ్యేవి. 1947 ఆగస్టు 15న భారత దేశం స్వాతంత్ర్యం పొందింది. స్వేచ్ఛ పొందిన భారతీయులు తమకు తాముగా ఒక సొంత రాజ్యాంగాన్ని తయారుచేసుకోవాలనుకున్నారు. దీని కోసం రాజ్యాంగ సభ ఏర్పటైంది. భారత రాజ్యాంగ రచనా సంఘానికి డా.బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షుడిగా పనిచచేశారు. ఈ రాజ్యాంగ సభ 2 సంవత్సరాల 11 నెలల,18 రోజుల కాలం రాజ్యాంగ రచనకు కష్టపడ్డారు. కొత్తగా రూపొందించుకున్న రాజ్యాంగ 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం భారత్ సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశమైంది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే గా జరుపుకుంటున్నాం. రిపబ్లిక్ అంటే ప్రభుత్వాధికారం ప్రజలచేతుల్లోనే ఉండటం, అందువల్లే ఇది మనకెంతో ముఖ్యమైన, పవిత్రమైన దినం.
ప్రతి సంవత్సరం మనం రిపబ్లిక్ డే ను జరుపుకోవటంలో ఒక ఉద్దేశం దాగుంది. అది , మన రాజ్యాంగాన్ని రక్షించుకోవలసిన పవిత్ర కర్తవ్యాన్ని గుర్తుచేసుకోవడమే. మనం అప్రమత్తంగా లేకపోతే మన స్వేచ్చను పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది.
ఈ రోజున దేశరాజధానిలోనూ, దేశంలోని అన్ని రాష్ట్ర రాజధానుల్లోను త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, కవాతులు నిర్వహించడం, దేశం పట్ల మన కర్తవ్యాన్ని గుర్తుచేసుకోవడం పరిపాటి. మరి భావిభారత పౌరులైన ప్రతి ఒక్కరు రిపబ్లిక్ డే రోజున జెండావందనం చేయటం వలన మన బాధ్యత గుర్తుంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more