కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఈసారి ఎవరు ఎంపిక అవుతారన్నదానిపై పార్టీలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. రాజ్యసభలో ఈసారి భారీగా ఖాళీలు ఏర్పడ నున్నాయి. దీంతో ఎవరు ఎంపిక అవుతారనే దాని పై అప్పుడే చర్చలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ కు చెందిన నలుగురు, సిపిఐ కి చెందిన ఒకరు, టిడిపికి చెందిన ఒకరు ఈసారి రిటైర్ కానున్నారు. కాంగ్రెస్ పక్షాన గతసారి అభ్యర్ధులుగా ఎంపికైన పిసిసి మాజీ అద్యక్షుడు డాక్టర్ కె.కేశవరావు, ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, ఐఎన్ టి యుసి అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, ఉత్తరప్రదేశ్ కు చెందిన నేత రషీద్ అల్వీ వీరిలో ఉన్నారు.అప్పట్లో మిత్ర పక్షంగా సిపిఐ పక్షాన అజీజ్ పాషా, టిడిపి తరపున మాజీ మంత్రి డాక్టర్ ఎమ్.వి.మైసూరారెడ్డి ఎన్నికయ్యారు.
అయితే ఈసారి కాంగ్రెస్ అభ్యర్దులలో ఇవ్వదలిస్తే ఒక్క సంజీవరెడ్డికే తిరిగి అవకాశం రావచ్చని చెబుతున్నారు. పార్టీ కార్మిక విభాగానికి సంబంధించి ఆయన ముఖ్యమైన నేతగా ఉండడం దీనికి కారణం చెబుతున్నారు. దాసరి నారాయణరావు ఇప్పటికే రెండుసార్లు పదవి ఇచ్చినందున ఈసారి ఇవ్వకపోవచ్చు. కొత్తగా అవకాశం వచ్చే వారిలో మెగాస్టార్ చిరంజీవి పేరు దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినందుకు ప్రతిఫలంగా ఆయనకు రాజ్యసభ ఇవ్వాలని నిర్ణయించారు.అలాగే దాసరి నారాయణరావు బదులుగా ఈయనకు అవకాశం రావచ్చు. ఇక మరోస్థానానికి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పేరు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవలికాలంలో ఆమెకు డిల్లీ కాంగ్రెస్ రాజకీయాలలో ప్రాధాన్యత పెరుగుతోందని, దానికి నిదర్శనంగా పార్టీ అధికార ప్రతినిది హోదా కల్పించడం కూడా గమనించవలసిన అంశమని చెబుతున్నారు. సోనియాగాందీతో సత్సంబంధాలు కలిగిన రేణుకా చౌదరికి ఈ అవకాశం రావచ్చని అంటున్నారు.
ఢిల్లీస్థాయి రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్న రేణుకా చౌదరికి రాజ్యసభ పదవి ఇవ్వడాన్ని తెలంగాణకు చెందిన కొంతమంది నాయకులు వ్యతిరేకించే అవకాశం లేకపోలేదు.ఈ మద్యకాలంలో తెలంగాణ అంశంపై హాట్ హాట్ వ్యాఖ్యలు చేసిన ఆమె వారికి ఆగ్రహం తెప్పించడమే ఇందుకు కారణం. వీటిని అధిగమించి రేణుకా చౌదరి రాజ్యసభ పదవి పొందగలుగుతారా అన్నది ఆసక్తికరమైన అంశంగాఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more