విశాఖ, సీమాంధ్రలో సహస్ర తులసీ శ్రీనివాసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత త్రిదండి చిన జియ్యర్ స్వామి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ లో జనవరి 2 నుంచి 4 వరకు కొనసాగనుంది. చివరిగా రాయలసీమలో ప్రొద్దుటూరు వేదికగా ముగియనున్న ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫునుంచి సహకారం లభిస్తుందని సమాచార శాఖా మంత్రి డికే అరుణ వాగ్దానం చేసారు. ముచ్చింతల్ దగ్గర జియ్యర్ స్వామి ఆశీస్సులను పొందిన మంత్రి అరుణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు సమాజాభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
అసలు రామానుజుల వైష్ణవ సాంప్రదాయమే ఒక పెద్ద ఆధ్యాత్మిక విప్లవం. అంతకు ముందు వరకూ కేవలం జన్మతోనే ఆచారవ్యవహారాలను పాటించే అగ్ర కులాలుగా పరిగణించబడతారన్న వాదనను తోసిపుచ్చి, ఏ కులమైనా వైష్ణావాన్ని తీసుకోవచ్చని, అందులో పాటించవలసిన విధి విధానాలలో శిక్షణనిస్తూ, అప్పట్లోనే రామానుజాచార్యులవారు హిందుత్వంలోనే పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చారు. చిన్న వయసులోనే రామానుజులు గురువుగారు తనకి రహస్యంగా ఉపదేశించిన మంత్రాన్ని ఆలయ గోపురమెక్కి గట్టిగా అందరికీ వినిపించేట్టుగా చదివారట. అందుకు ఆయన గురువుగారు ఆగ్రహించగా, నేనేమైనా పరవాలేదు కానీ ఈ మంత్రం ఎంతో మేలు చేస్తుందని చెప్పారుగా అందుకే అందరికీ ఉపయోగపడాలని అలా చేసానన్న ఆధ్యాత్మిక విప్లవకారుడు రామానుజాచార్యుల గురుపరంపరలో ఎన్నో వైష్ణవ పీఠాలు వెలిసాయి. అందులో ఒక పీఠమే చిన్న జియ్యర్ స్వామి ఆధ్వర్యంలో దేశ విదేశాల్లో ఖ్యాతిగడించిన వైష్ణవ పీఠం.
భక్తిని పెంచుతూ, అందరూ పఠించగలరు అన్న నమ్మకాన్ని పెంపొందిస్తూ, అందరిచేతా విష్ణు సహస్ర నామాలు, భగవద్గీత శ్లోకాలు చదివిస్తూ, అందులో పోటీలు పెడుతూ చేపట్టిన కార్యక్రమాల వలన హిందూ సాంప్రదాయం మీద అందరికీ ఆసక్తి పెరగటమే కాకుండా, కుల వివక్షలు పోవటానికి కూడా దోహదం చేస్తోంది. ఏ కులంలో జన్మించినా వైష్ణవం తీసుకున్న తర్వాత వైష్ణవులే. ఈ విధంగా సమాజంలోని అంతరాలు అంతరించటమే కాకుండా, హిందూ మతం లోంచి ఇతర మతాల్లోకి పోతున్నవారికి ఆనకట్ట వేసి హిందుత్వంలో నిలిచిపోయేట్టుగా కూడా పరోక్షంగా పాటుపడుతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more