వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన అనుంగ మిత్రడుడైన కేపీవీ రామచంద్రరావు ముఖ్యమంత్రి తరువాత స్థానం నాదే అనేట్లుగా వ్యవహరించేవాడు. ఒకప్పుడు ఆయన మాట శిలాశాసనం. ముఖ్యమంత్రి కాకపోయినా ఆయన ఆత్మబంధువు కావడంతో ఆ స్థాయిలో ఆయన హవా నిర్నిరోధం గా సాగింది. ఐఏఎస్, ఐపీఎస్ నుంచి మంత్రుల వరకూ ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. బదిలీలు, పదోన్నతులు... ఒకటేమిటి? ప్రభుత్వంలో ఏ ఫైలు కదలాలన్నా, బిల్లులు మంజూరు కావాలన్నా, ఆగిపోవాలన్నా, కార్పొరేషన్ పదవులు రావాలన్నా, ఆగాలన్నా, ఎంపీ- ఎమ్మెల్యే టికెట్లు కావాలన్నా- రాకూడదనుకున్నా ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు కావలసిందే. అప్పుడు అధిష్ఠానం వద్ద కావలసినంత పలుకుబడి. ఆత్మబంధువు పక్షాన హస్తినలో ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టేంత పలుకుబడి. అధిష్ఠానం అవసరాలను మిత్రుడి ద్వారా నెరవేర్చిన కార్యదక్షుడు. మరి అంతటి వాడికి కాలం ఇప్పుడు కాలం కలిసి రావడంలేదు. వైయస్సార్ మరణించిన తరువాత ఇతనికి అంతంత మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు కాంగ్రెస్ వారు. ఆయన ఊసు లేకుండానే అన్నీ జరిగి పోతున్నాయి. ఆయనను పట్టించుకునే దిక్కులేదు. కనీసం ఇతను ఎదురవుతే పలకరించే వారు లేరు. చివరకు అధిష్ఠానం కూడా పక్కనపెట్టింది.
కాంగ్రెస్ కి కీలకమైన సమన్వయ కమిటీలో చోటులేకుండా చేసింది. కాంగ్రెస్ నాయకత్వం తాజాగా ప్రకటించిన సమన్వయ కమిటీలో కేవీపీకి స్థానం లేకుండా చేయటంతో ఆయన పలుకుబడి పలచబడిందని, నాయకత్వం ఆయనను పక్కకుపెట్టిందన్న సంకేతా లు కిందిస్థాయి వరకూ వెళ్లాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more