ప్రతిపక్షం పార్టీ తెలుగు దేశం పెట్టిన అవిశ్వాసం అర్థరాత్రి వీగిపోయింది. అవిశ్వాసంలో అసలు విషయం తేలిపోయింది. ముందే ఫలితం తెలిసిన పరీక్షలో కిరణ్ కుమార్ రెడ్డి గెలుపోందారు. ఇన్ని రోజులు భీరాలు పలుకుతూ ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు పై సవాలు విసిరిన జగన్ తనకు బలం లేదని నిరూపించుకున్నాడు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా 160 ఓట్లు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. తెలుగుదేశం సభ్యులు 85 మంది, టిఆర్ఎస్ సభ్యులు 11 మంది, సిపిఐ సభ్యులు నలుగురు, బిజెపి సభ్యులు ఇద్దరు, సిపిఎం సభ్యుడు ఒకరు, స్వతంత్ర సభ్యుడు ఒకరు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. ఒకరు తటస్థంగా ఉండగా, ముగ్గురు సభకు గైర్హాజరయ్యారు. గైర్జారైనవారిలో ఒకరు టిఆర్ఎస్ సభ్యుడు, ఒక మజ్లీస్ సభ్యుడు, జగన్ వర్గం ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవడానికి 143 ఓట్లు అవసరం కాగా, 161 ఓట్లు వచ్చాయి. సాధారణ మెజారిటీ కన్నా ప్రభుత్వానికి 17 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ప్రభుత్వానికి ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు 17 మంది, మజ్లీస్ సభ్యులు ఆరుగురు మద్దతిచ్చారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటా 10 నిమిషాల సమయంలో ఓటింగ్ జరిగింది. జయసుధ ప్రభుత్వానికి మద్దతు పలికారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించిన తర్వాత స్పీకర్ నాదెండ్ల మనోహర్ శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు.
దీంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాసానికి అనుకూలంగా 122 ఓట్లు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన 18 మంది శాసనసభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ అవిశ్వాసానికి మద్దతిచ్చారు. పూతలపట్టి రవి ఓటింగుకు గైర్హాజరయ్యారు. ఓటింగు జరగడానికి ముందు ఆయన సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 122 మంది సభ్యులు ఓటేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏకైక శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more