గొలుసుకట్టు వ్యాపారం పచ్చి మోసమని ఎన్ని ప్రకటనలు వెలువడినా ప్రజలింకా మోసపోవటంలోనే ఉత్సాహం చూపిస్తున్నారు. ఎక్కువ కష్టపడకుండా, తీరిక సమయాల్లో మీ ఇంటి దగ్గర్నుంచే సంపాదిస్తూ లక్షలకు లక్షలు కూడబెట్టవచ్చని తమ వాక్చాతుర్యంతో నచ్చచెప్తుంటే, అది విని మదుపులు పెట్టేవారు ఎందుకు ముందుకొస్తున్నారూ అంటే వీరందరికీ తేరగా వచ్చే దానిమీద ఆసక్తి ఎక్కువు. మీ కలలన్నీ సాకారం చేసుకోవచ్చని, విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చని చెప్తున్న గొలుసుకట్టు నిర్వాహకులు, ఏజెంట్ల వాగ్దానాలను వారు చూపించిన చెక్కులు, అందించే బిరుదులకు ఆకర్షింపబడటమే కాదు, స్వతహాగా వీరందరికీ అంతర్గతంగా ఉన్న ఉబలాటమంతా పక్కవారి సొమ్ము కొట్టేద్దామనే. ఇంత మందిని చేర్పించండి, బదలుగా ఇంత తీసుకోండి అని చెప్పగానే వీరి లెక్కలు మొదలౌతాయి. ఆ వచ్చేదంతా తాము సభ్యులుగా చేర్పించినవారి సొమ్మే.
దీన్ని మనీసర్కులేషన్ పరిధిలోకి రాకుండా ఉండటం కోసం రకరకాల ముసుగులు కప్పి, నిత్యావసర వస్తువుల దగ్గర్నుంచీ రియల్ వ్యాపారాల వరకూ దీనికి జోడించటం, మధ్యవర్తులను తొలగించటం వలన ఆ లాభమంతా పంచుతున్నామనే లెక్కలు చూపించటం చేస్తున్నా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అటువంటి సంస్థల మీద కొరడా ఝళిపించింది.
ఎప్పటి నుంచో వేళ్ళు పాతుకునిపోయి ఉన్న ఆమ్వే లాంటి సంస్థలను సైతం కోర్టుకి లాగి వాటి కార్యకలాపాలను నిలిపివేసిన ఘనత కేవలం ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖకే చెందుతుంది. బాధితుల ఫిర్యాదుల మేరకు దర్యాప్తులు చేసి, వారినివలవేసి పట్టుకుంటున్నారని తెలిసి కొందరు నిర్వాహకులు చెన్నైలో తలదాచుకున్నారని తెలిసింది. అలాంటివారిలో నెల్లూరు నుంచి పరారైన లాజరస్, తోట శ్రీనివాసులు, సువర్ణరావు, ఏసురత్నం లాంటి వారి కోసం డిఎస్ పి విజయ్ కుమార్ ఏజెంట్ల నుండి ఆచూకీ , వారి కోసం గాలింపులు చేపట్టారు.
ఇలాంటి కార్యకలాపాలు మొదట్లో నగరాల్లో జరిగాయి. ఆతర్వాత జిల్లా స్థాయికి, గ్రామాలకు పాకాయి. నా కష్టం నేను అనుభవిస్తాను, ఎవరి సొమ్మూ నాకు వద్దు అనే మనస్తత్వం మనుషుల్లో రానంతవరకూ ఇలాంటి మోసాలు, వాటికి బలయ్యేవారూ ఉంటూనేవుంటారు.
శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more