తెలంగాణ ప్రక్రియ తమ ఒత్తిడి వల్లే ఆగిందని ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. తాము సాధించిన మొదటి విజయంగా ఆయన పేర్కొన్నారు. మిగిలిన పార్టీలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పడే సమ్మెకు దిగాల్సిన అవసరం లేదన్నారు. సమ్మె అనే బ్రహ్మాస్త్రాన్ని ముందు ముందు ఉపయోగించాల్సి ఉంటుందని ప్రభుత్వ ఉద్యోగులకు లగడపాటి రాజగోపాల్ ఈ సందర్భంగా సూచించారు. అయితే మేం సమైక్యాంధ్రను కోరడం లేదని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి న్యూఢిల్లీలో పేర్కొన్నారు. మా ప్రాంతంలోని ప్రజలకు నీరు, విద్యుత్, విద్య, ఉపాధి అవకాశాల కల్పనే తమ పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన తెలిపారు. తమ ప్రాంత ప్రజలకు అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని యూపీఏ సర్కార్ ను ఆయన డిమాండ్ చేశారు. ఆ క్రమంలో న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామన్నారు. కాగా ఇరుప్రాంతాల ప్రజలు బాగుండాలనే తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారని మోదుగుల వేణుగోపాలరెడ్డి ఈ సందర్బంగా తెలిపారు.
సమ్మెకు సిద్దమైన కాగడా
సమైక్యాంద్ర ఉద్యమంలో పాల్గొనేందుకు ఆర్టీసి నేషనల్ మజ్థూర్ యూనియన్ సిద్దమైంది. ఏపీ ఎన్జీవోస్ 12 వ తేదీ నుంచి తలపెట్టిన నిరవదిక సమ్మెల్యే పాల్గొనాలని నేషనల్ మజ్థూర్ యూనియన్ నిర్ణయించింది. సీమాంద్ర నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ఎన్జీవోస్ ఇచ్చిన డెడ్ లైన్ దాటిన దగ్గర నుంచి వారితో కలిసి ఆందోళనల్లో పాల్గొంటామని ఎన్ఎంయూ విజయవాడ జోన్ అధ్యక్షుడు సుబ్రహ్మణేశ్వరరావు తెలిపారు. దీనికి సంబంధించిన సమ్మె నోటీసులను సీమాంద్రలోని నాలుగు జోన్ (విజయవాడ , విజయనగరం , కడప, నెల్లూరు) ల ఈడీలకు ఈరోజు అందజేస్తున్నట్లు తెలిపారు.
అర్థనగ్న ప్రదర్శనలు
సమైక్యాంద్రకు మద్దతుగా విజయవాడ జోన్ లోని అన్ని డిపోల ఎదుట ఈరోజు అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే 11వ తేదీన నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మౌన ప్రదర్శన ఉంటుందన్నారు. 12వ తేది అర్థరాత్రి నుంచి బస్సులన్నింటిని నిలిపివేసి ఎన్జీవోస్ కు మద్దతుగా నిరవదిక సమ్మెలో పాల్గొంటామని జయవాడ జోన్ అధ్యక్షుడు సుబ్రహ్మణేశ్వరరావు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more