ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లు అజ్నాతం పై వస్తున్న వార్తలపై నూజివీడు శాసనసభ్యుడు రామకోటయ్య ఆ ఇరువురు నేతలకు లేఖలు రాశారు. వాటిని విలేఖరులకు అందజేశారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి ముఖ్యమంత్రి సచివాలయానికి రాక పోవడంతో పాటు చంద్రబాబు అప్పటి నుంచి మౌనం వహించడంపై ప్రజలకు తప్పుడు సంకేతాలు అందుతున్నాయని అన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి , ప్రతిపక్షనేత కార్యోన్మఖులై ప్రజలకు ఉపశమనం కలిగించే దిశలో ఉద్యుక్తులు కావాలని తాను వేడుకుంటున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు.
కొనసాగుతున్న నిరసనలు
నందిగామలో తెలంగాణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు ఈ రోజు కొనసాగాయి. న్యాయవాదులు, ఐసీడీఎస్ కార్యకర్తల ఆద్వర్యంలో గాంధీ సెంటర్ లో మానవహారం నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో ఆదర్శ రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. చైతన్య కళాశాల విద్యార్థులు , వైకాపా నాయకులు తెలంగాణకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
5వేల మంది
ఉయ్యూరులో సమైక్యాంద్రకు మద్దతుగా బంద్ ప్రకటించారు. వ్యాపార సంస్థలకు చెందిన వారు, వివిధ కళాశాలల విద్యార్థులు, కేసీపీ కార్మికులు, టైలర్లు ఎన్జీవోలు, ప్రజలు అంతా కలిసి దాదాపు 5 వేల మందికి పైగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకపక్క మానవహారం నిర్వహిస్తున్నారు. మరో పక్క ఉయ్యూరు కేసీపీ నుంచి ఉయ్యూరు సెంటరు వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. సమైక్యాంద్రకు మద్దతుగా బంద్ సంపూర్ణంగా జరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more