A Historical Story Of Jimutavahana Who Sacrifies His Life For Snake Species | Telugu Vyasalu | Telugu Mythological Stories

Jimutavahana special story who sacrifies his life for snake species

Jimutavahana special story, Jimutavahana mythological story, Jimutavahana special story, Jimutavahana history, Jimutavahana vyasam, Jimutavahana essay story, garuthmantha special story, jimutavahana garuthmantha historical story, telugu mythological stories

Jimutavahana Special Story Who Sacrifies His Life For Snake Species : A Historical Story Of Jimutavahana Who Sacrifies His Life To Save Snake Species.

మానవత్వానికి మారుపేరుగా నిలిచిన జీమూతవాహనుడు

Posted: 10/08/2015 05:02 PM IST
Jimutavahana special story who sacrifies his life for snake species

పూర్వం జీమూతకేతువు అనే చక్రవర్తికి ‘జీమూతవాహనుడు’ అనే కుమారుడు వుండేవాడు.  ఇతను చిన్నప్పటి నుంచి రాజ్య ప్రజలు,  అన్నిప్రాణుల పట్లా ఎంతో కారుణ్యంతో ఉండేవాడు. రాకుమారుడు అయినప్పటికీ అతనితో అహంకారం వుండేది కాదు. ఇటువంటి వ్యక్తి మానవత్వానికి మారుపేరుగా నిలిచాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఒక జాతినే రక్షించాడు.

ఒకరోజు జీమూతుడు అడవిలో విహారం చేస్తుండగా ఒక తెల్లని గుట్ట కనిపించింది. అదేమిటాని దాని దగ్గరకు వెళ్లి చూసిన అతను, అవన్నీ ఎముకుల పోగులు అని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఇంతలో అతనికి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని అనుసరించిన జీమూతవాహనుడికి ఒక ముసలి పాము కనిపిస్తుంది. ‘అమ్మా! నువ్వెవరు? ఎందుకలా ఏడుస్తున్నావు? ఆ ఎముకుల గుట్ట ఏమిటి?’ అని అతడు అడుగుతాడు. అప్పుడా ముసలి పాము.. ‘ఏం చెప్పమంటారు! ఆ విష్ణుమూర్తికి వాహనమైన గరుత్మంతుడు మా జాతిని నిర్మూలించేందుకు కంకణం కట్టుకున్నాడు. రోజూ మా మీద పడి మమ్మల్ని చీల్చి చెండాడుతున్నాడు. అతని బాధ తట్టుకోలేని మేము.. ‘రోజూ మాలో ఎవరో ఒకరం స్వచ్ఛందంగా నీకు ఆహారంగా మారతాము’ అని వేడుకున్నాము. ఇప్పుడు నా కుమారుడైన ‘శంఖచూడు’ని వంతు వచ్చింది. అందుకే ఈ వేదన!’ అని చెప్పుకొచ్చింది. ఆ మాటలు విన్న జీమూతవాహనుడి మనసు కరిగిపోయింది. గరుత్మంతుని హింస ఇలాగే కొనసాగితే ఈ ప్రపంచంలో పాము అన్న ప్రాణి ఏదీ మిగలదని భావించి.. శంఖచూడునికి బదులుగా తనే ఆహారంగా మారేందుకు సిద్ధపడతాడు.

ఆ మరుసటి రోజు గరుత్మంతుడు అనుకున్న సమయానికి వచ్చాడు. భారీకాయుడైన గరుత్మంతునికి.. ఆ బలిపీఠం మీద ఉన్నది జీమూతుడని తెలియలేదు. అతని శరీరాన్ని పొడిచి పొడిచి చంపసాగాడు. ఇంతలో అక్కడికి మిత్రవసుపు చేరుకుని... ‘గరుత్మంతా! నీ ముందు ఎవరు ఉన్నారో కూడా సరిచూసుకోనంతగా కళ్లు మూసుకుపోయాయా! నీ కాలి కింద ఉన్నది పాము కాదు, నాలాంటి మనిషే. దయచేసి అతణ్ని వదిలిపెట్టు. ఒక అల్పమైన ప్రాణి కోసం తన జీవితాన్నే బలి ఇవ్వడానికి సిద్ధపడిన అతని త్యాగాన్ని గుర్తించు’ అని వేడుకున్నాడు. మిత్రవసువు మాటలను విని కింద చూసిన గరుత్మంతునికి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. కానీ జీమూతవాహనుడిలో ప్రాణం అప్పటికే అడుగంటింది. చేసిన తప్పుకు తనను తాను తెగ నిందించుకున్నాడు గరుత్మంతుడు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్ని జీమూతవాహనుడి కుటుంబం భోరున విలపించసాగింది. వారి దుఃఖాన్ని చూసిన గరుత్మండికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే స్వర్గలోకానికి వెళ్లి అమృతభాండాన్ని తీసుకువచ్చాడు. దానితో జీమూతవాహనుడిలో కొడగట్టిన ప్రాణం తిరిగి మేల్కొంది.

తన ప్రాణాలను తిరిగి దక్కించుకున్న జీమూతవాహనుడు సంతోషించలేదు సరికదా, సాటి జీవులు నిరంతరం గరుత్మంతునికి ఆహారంగా మారుతుంటే దాన్ని చూస్తూ గడిపే జీవితం ఎందుకు అని దుఃఖించాడు. జీమూతవాహనుడి దుఃఖం గరుత్మంతునిలో సైతం పరివర్తన కలిగించింది. ఇకమీదట తాను పాముల జోలికి పోనని జీమూతునికి వాగ్దానం చేశాడు. అంతేకాదు తాను తెచ్చిన అమృతాన్ని ఆ ఎముకుల గుట్ట మీద పోసి తాను చంపిన పాములన్నింటినీ తిరిగి బతికించాడు. ఈ విధంగా తన దీక్షతో ఏకంగా ఒక జాతినే కాపాడినవాడయ్యాడు జీమూతవాహనుడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : garuthmantha history  Jimutavahana mythological story  telugu histories  

Other Articles

  • King mandhata defeated ravan in big war

    రావణాసురుడిని ఓడించిన మాంధాత

    Nov 13 | రామాయణంలో రాముడి చేత సంహరించబడిన రావణుడు.. అంతకుముందే మరొకరి చేతిలో ఓడిపోయాడు. అతడి పేరే మాంధాత. ఇతడు యవనాశ్వుని కుమారుడు. భ్రుగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించినందువల్ల యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు.... Read more

  • Akroorudu history in mahabharat and sitaram kalyan

    శ్రీకృష్ణుడిని హెచ్చరించిన అక్రూరుడు

    Jul 03 | అక్రూరుడికి సంబంధించిన ప్రస్తావన మహాభారతంలో ప్రచురించబడింది. ఇతిహాస కథలలో కొన్ని విచిత్రమైన పాత్రలు ప్రత్యేకంగా చెప్పబడేవి. అందులో కొన్ని పాత్రలు ద్వంద్వ స్వభావాన్ని కనబరిస్తే... మరికొన్ని పాత్రలు ఇరువర్గాలకు నష్టాన్ని కలిగించేలా వుండేవి. అటువంటి... Read more

  • The glorious history of upa pandavas

    కురుక్షేత్రంలో ఉపపాండవుల విన్యాసం

    Jun 14 | పాండవులు, ద్రౌపదికి కలిగిన ఐదుగురు సంతానాన్ని ఉప పాండవులగా పిలుస్తారు. పాండవులకు ఒక్కొక్కరుగా ఒక్కొక్క పుత్రుడు జన్మించారు. 1. ప్రతివింధ్యుడు - (ధర్మరాజు పుత్రుడు)2. శ్రుతసోముడు - (భీముని పుత్రుడు)3. శ్రుతకర్ముడు - (అర్జునుని... Read more

  • The glory of saraswati devi in epic

    సరస్వతీదేవి మహిమను తెలిపే ఇతిహాసం

    Jun 10 | సరస్వతీదేవిని ప్రతిఒక్కరు ఎంతో దైవంగా పూజిస్తారు. ఈమెను చదువుల తల్లిగా పేర్కొంటారు. సరస్వతీదేవి సన్నిధిల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే.. వారికి చదువు ఎంతో బాగా లభిస్తుందని, భవిష్యత్తు కార్యకలాపాల్లో విజయాలు సాధిస్తారని, జీవిత ప్రయాణంలో... Read more

  • Srimad bhagavatham vyasam

    శ్రీమద్భాగవతము

    Feb 17 | మొదటి అధ్యాయము :  ఈ జగత్తులో సృష్టి లయానికి కారకుడు, దానికి వ్యతిరేకుడు ఎవరో, ఈ సమస్త జగత్తుకు కర్త ఎవరో, తన సొంత సిద్ధ జ్ఞానముతో విరాజిల్లువాడు ఎవరో, బ్రహ్మదేవునికి కూడా జ్ఞానాన్ని... Read more