భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో కృషి చేసిన రాజకీయ నాయకుల్లో శంకర్ దయాళ్ శర్మ ఒకరు. దేశానికి 9వ రాష్ట్రపతిగా వ్యవహరించిన ఈయన.. బ్రిటీష్ పాలన నుంచి దేశాన్ని స్వాతంత్ర్యం కలిగించేందుకు పోరాడిన సమరయోధుల్లో కీలకపాత్ర పోషించారు. తన వాక్చాతుర్యంతో స్వాతంత్ర్యంపై ప్రజల్లో చైతన్యం నింపారు. అందరినీ ఉద్యమబాటలో నడిపించడంలో తనదైన శైలిలో ప్రణాళికలు రూపొందించారు. ఈయన గొప్ప పండితుడు కూడా! ఇక రాజకీయ రంగంలో ఈయన ఎన్నో పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. ఓ సాధారణ స్థాయి నుంచి రాష్ట్రపతి హోదా వరకు అంచెలంచెలుగా ఎదిగారు.
జీవిత విశేషాలు :
1918 ఆగష్టు 19వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ నగరంలో జన్మించారు. శర్మ సెయింట్ జాన్ కళాశాల, ఆగ్రా కళాశాల, అలహాబాద్ విశ్వవిద్యాలయం, లక్నో విశ్వవిద్యాలయం, ఫిట్జ్ విలియం కళాశాల, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, లింకన్స్ ఇన్, హార్వర్డ్ న్యాయ పాఠశాల మొదలైన విద్యాసంస్థల్లో ఈయన విద్యాభ్యాసం కొనసాగింది. చదువుకునే రోజుల్లో ఈయన అన్ని విభాగాల్లో చురుకుగా పాల్గొనేవారు. చాలా తెలివైనవారు కూడా!
దేశప్రజలపై తెల్లదొరల ఆకృత్యాలను పూర్తిగా నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఆనాడు ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల్లో శంకర్ దయాళ్ కూడా పాల్గొన్నారు. 1940వ దశకంలో శర్మ భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. అదే దశకంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి వరకూ అదే పార్టీకి విధేయులుగా ఉన్నారు. స్వాతంత్ర్యానంతరం 1952లో అప్పటి భోపాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో భోపాల్ మిగతా చిన్న రాష్ట్రాలతో కలిసి మధ్యప్రదేశ్ ఏర్పడేవరకూ ముఖ్యమంత్రిగా పని చేశాడు. 1960లలో ఇందిరా గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడాన్ని సమర్థించారు. ఆమె ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేక మంత్రి పదవులు నిర్వహించారు.
1974-77 మధ్యలో కమ్యూనికేషన్ల శాఖా మంత్రిగా పని చేశారు. 1992 నుండి 1997 వరకు రాష్ట్రపతిగానూ, 1987 నుండి 1992 వరకు రామస్వామి వెంకటరామన్ రాష్ట్రపతిగా ఉన్నపుడు, ఉపరాష్ట్రపతిగానూ వ్యవహరించారు. అంతకుముందు 1952-56 మధ్యలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విద్యా శాఖ, న్యాయ శాఖ మొదలైన అనేక శాఖల్లో కేంద్రమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా బాధ్యతలు చేపట్టారు. 1972-74 మధ్యలో భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా పనిచేశారు. తన చివరి రోజుల్లో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన.. 1999 అక్టోబర్ 9న గుండెపోటుతో ఢిల్లోని ఒక వైద్యశాలలో అడ్మిట్ అయ్యారు. కొద్ది సేపటికే తుదిశ్వాస విడిచారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more