దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బహుబలి ’ సినిమా లో భారీ తారాగణం నటిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు హీరోలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క నటిస్తుండగా, రాణా కు జోడిగా ఎవర్ని తీసుకోవాలనే విషయంలో సంగ్దిద్దత నెలకొంది. ఇప్పటి వరకు ఎవర్ని ఎంపికచేయని రాజమౌళి ఈ సినిమాలో ప్రణీతను తీసుకున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా కోసం ప్రణీతను సంప్రదించలేదని రాజమౌళీనే స్వయంగా చెప్పడంతో ఆ పుకార్లకు పుల్ స్టాప్ పడింది.
ఇప్పుడు ఈ సినిమా లో సెకండ్ హీరోయిన్ గా రాణాకు జోడిగా లావణ్య త్రిపాఠీని ఎంపిక చేసుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. గతంలో ఈ అమ్మడు ‘అందాల రాక్షసి ’ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ టైంలో రాజమౌళి ఈమె పై ప్రశంసల వర్షం కూడా కురిపించాడు. తన తరువాత సినిమా ఛాన్స్ ఇస్తానని కూడా చెప్పాడు. అప్పుడు అన్న మాట ప్రకారం ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు . ఇటీవలే లావణ్యకి రాజమౌళి మేకప్ టెస్ట్లు కూడా చేశాడని అన్నీ కుదరడంతో ఈమెను ఖరారు చేసుకున్నారని అంటున్నారు .
ఈ సినిమాలో ఆమె ఓ యువరాణిగా కనిపించనుందట. ఇక 2015 లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ మీడియోలను విడుదల చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం కేరళలోని మలబార్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. మొత్తానికి లావణ్య త్రిపాఠీ జాక్ పాట్ కొట్టేసిందని, ఈ అమ్మడు దశ తిరిగినట్లేనని కొందరు అంటుంటే.... రాజమౌళి కన్ ఫర్మ్ చేసే వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు మరికొందరు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more