Cm kiran speaks to media after gom meet

CM Kiran speaks to media after GoM meet, chief minister met the GoM, CM Kiran Press meet after Meeting GoM, N Kiran Kumar Reddy, telangana issue, congress party,

CM Kiran speaks to media after GoM meet, chief minister met the GoM, CM Kirans Press meet after Meeting GoM,

ప్యాకేజీ ఇవ్వమని కోరా : సీఎం కిరణ్

Posted: 11/18/2013 07:03 PM IST
Cm kiran speaks to media after gom meet

సీఎంగా ఉన్న మూడేళ్లలో అన్ని అంశాలపై క్షుణ్ణంగా అద్యయనం చేశానని, విభజన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలిన జీవోఎంను కోరానని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరన్ కుమార్ రెడ్డి చెప్పటం జరిగింది. తెలంగాణలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరానని ఆయన చెప్పారు. జీవోఎం తనను ముఖ్యమంత్రిగానే పిలిచిందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయాని సీఎం కిరణ్ తెలిపారు. రాష్ట్ర విభజన చారిత్రక తప్పిదమని, విభజన జరిగితే రెండు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని, ప్రభుత్వ ఉద్యోగులు, నీటి వనరులు, విద్య, ఉపాధి, వైద్య సదుపాయలు, విద్యుత్ పంపకాలు చేయడం చాలా కష్టమని, అన్ని ప్రాంతాల వారికి తీవ్ర ఇబ్బందులు వస్తాయని వివరించినట్లు తెలిపారు.

 

విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌లో నక్సలీజం, తీవ్రవాదం పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జీవోఎంకు వివరించినట్లు తెలిపారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలని, వీటికి పరిష్కార మార్గం చూపించకుండా విభజన జరిపితే పెద్ద సమస్య వస్తుందని, ఈ విషయాన్ని దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చెప్పారని, ఈ విషయాన్ని లేఖలో స్పష్టం చేశామని, లేఖతోపాటు రెండు పుస్తకాలు కూడా జతచేసి జీవోఎంకు అందజేశామని ఆయన అన్నారు. మన దేశానికి అతి పెద్ద సమస్య నక్సలీజమని, ఇదే విషయాన్ని కనీసం ఆరేడుసార్లు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చెప్పిన విషయాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి గుర్తు చేస్తూ,ఆ లేఖలో తెలిపారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో మరీ ఎక్కువగా ఉందని ఆయన జీవోఎంకు తెలిపినట్లు చెప్పారు. ఇప్పటి వరకు సామాజిక అభివృద్ధితో నక్సలిజాన్ని అరికట్టగలిగామని అన్నారు. మావోయిస్టు కేంద్ర అగ్రనేతలు 18 మందిలో 15 మంది అగ్రనాయకులు ఆంధ్రప్రదేశ్‌వారేనని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. దీంతో మతతత్వ శక్తులు పెట్రేగే ప్రమాదం ఉందని జీవోఎంకు చెప్పడం జరిగిందని సీఎం తెలిపారు. జమ్మూ-కాశ్మీర్ తర్వాత ఉగ్రవాదులు హైదరాబాద్‌ను టార్గెట్ చేశారని, నక్సలీజం సమస్య విశాఖ, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఉందని, విభజన జరిగితే పోలీస్ వ్యవస్థ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థ తగ్గుతుందని, దీంతో నక్సలీజాన్ని అరికట్టడం సమస్య అవుతుందని జీవోఎంకు చెప్పడం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు.

  

 ఉదాహరణకు హైదరాబాద్‌లో వినాయక చవితి సందర్భంగా 14 జిల్లాల నుంచి పోలీస్ వ్యవస్థను పిలిపించి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగుతుందని, విభజన జరిగితే అది సాధ్యం కాదని, హింస జరిగే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. హైదరాబాద్ వచ్చేసరికి రెండు ప్రాంతాల్లో ఎన్ని ఉద్యమాలు జరిగినా, హైదరాబాద్ శాంతియుతంగా ఉందని, ఎలాంటి సమస్యలు రాలేదని, అంచేత హైదరాబాద్‌ను తటస్థంగా ఉంచితే మంచిదని జీవోఎంకు సూచించడం జరిగిందని సీఎం కిరణ్ తెలిపారు.

 

అయితే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఫార్మా, ఇండస్ట్రీస్, కార్పొరేట్ ఆస్పత్రులు అన్ని ఇక్కడే ఉన్నాయని, విభజన జరిగితే సమస్యలు వస్తామని వివరించడం జరిగిందని సిఎం పేర్కొన్నారు. 1972లో రాష్ట్ర విభజన జరిగితే ఇంత సమస్య ఉండేది కాదని, ఇప్పుడు హైదరాబాద్ పూర్తిగా అన్నివిధాల అభివృద్ధి చెందిందని, హైదరాబాద్‌తో ముడిపడి ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఇబ్బందులు వస్తాయని, 90 శాతం ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని, విభజన జరిగితే సమస్యలు వస్తాయని, విభజనపై మరొక్కసారి పునరాలోచించాలని జీవోఎంకు చెప్పడం జరిగిందని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more