కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఆరుగురు కామాంధులు ప్రియుడి ఎదుటే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మైసూరు నగర శివార్లలోని లింగాంబుధి చెరువు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ లాడ్జిలో పనిచేస్తున్న ఓ యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమలో వున్నారు. ఘటన జరిగిన రోజు సాయంత్రం లాడ్జీలో విధులు ముగించుకున్న తరువాత వీరిద్దరూ లింగాంబుధి చెరువు వద్దకు కబుర్లు చెప్పుకొనేందుకు వెళ్లారు.
అదే సమయంలో మద్యం మత్తులో వున్న ఆరుగురు యువకులు కారులో అక్కడికి చేరుకున్నారు. యువతిని చెరువుకు వెళ్లే దారి నుంచి కిందకు లాగిన యువకులు అమెను నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి అమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. అడ్డుకునేందుకు యత్నించిన అమె ప్రియుడ్ని కామాంధులు తాళ్లతో చెట్టుకు కట్టేసి బండరాయితో అతని తలపై మోది.. యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అఘాయిత్యానికి తెగబడిన తరువాత వారు అక్కడి నుంచి పారిపోయారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కోంది.
దీంతో కేసు నమోదు చేసుకున్న జయపుర పోలీసులు.. బాధితులకు చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు. కాగా వారిద్దిరి పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు తెలిపారు. అయితే నిందితుల్ని గుర్తుపట్టడం కాస్త కష్టంతో కూడుకున్న పనేనని, ఎందుకుంటే అక్కడ పూర్తిగా చీకటి అలుముకుందని.. వారి ముఖ్యాలను గుర్తుపట్టేంత వెలుతురు కూడా లేదని బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో ఘటనాస్థలంలో ఆ రాత్రి ఎవెరెవరు వున్నారన్న సమాచారం కోసం పోలీసులు మొబైల్ ఫోన్ సిగ్నల్ కోసం డేటాను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఎనమిది పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more