భారతదేశ అందాల పోటీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘ఫాండ్స్ ఫెమినా మిస్ ఇండియా’ (ఫి.ఎఫ్.ఎం. ఐ) పోటీల్లో విశాఖ పట్నానికి చెందిన ధూళిపాల శోభిత మొదటి రన్నరప్ గా నిలిచి మిస్ ఇండియా (ఎర్త్) కిరీటాన్ని సాధించి చరిత్ర స్రుష్టించారు. ఆ కిరీటాన్ని దక్కించుకున్న మొట్టమొదటి విశాఖ యువతిగా రికార్డు నమోదు చేశారు. పాండ్స్ ఫెమినా పోటీలో మిస్ ఇండియా(ఎర్త్)గా కిరీటం సాధించిన శోభిత గుంటూరు జిల్లా తెనాలిలో 1992 జూన్ 15న జన్మించింది. తండ్రి వేణుగోపాలరావు మెరైన్ ఇంజనీర్. తల్లి శాంతా కామాక్షి టీచర్. ప్రస్తుతం ముంబైలోని హెచ్ఆర్ కాలేజీలో 'కామర్స్ అండ్ ఎకనామిక్స్'లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న శోభిత.. 2007లో విశాఖ వ్యాలీ స్కూల్లో ఎంఈసీలో చేరింది. అప్పట్లోనే థాయ్లాండ్ విహారయాత్రకు వెళ్లినప్పుడు.. మిస్ ఇండియా గా గెలుస్తానని చెప్పింది. శోభిత లక్ష్యసాధన కోసం ఆమె తల్లిదండ్రులు విశాఖ నుంచి ముంబైకి మకాం మార్చారు. ఈ పోటీలకు ముందు జనవరిలో.. శోభిత మిస్ బెంగళూరుగా ఎంపికైంది.
అంతకుముందు య మహా రే ఫెమినా 'మిస్ అడ్వెంచర్'గా, 2012లో మ్యా క్స్ ఫెమినా 'మిస్ ఫ్యాషన్ ఐకాన్'గా, ట్రెసిమ్ ఫెమినా పోటీల్లో 'మిస్ స్టైలిష్ హెయిర్-2013'గా ఎంపికైంది. శోభిత సాహసి. స్పష్టమైన ఆలోచనలు, లక్ష్యం గల అమ్మాయి. ఇంటర్లో అంతా ఇంజనీరింగ్, మెడిసిన్ అంటుంటే.. తాను 'మిస్ ఇండియా'ను టార్గెట్గా పెట్టుకుంది. అలాగని చదువును నిర్లక్ష్యం చేయలేదు. మంచి మార్కులు తెచ్చుకుంది. ఆమె మరిన్నిఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more