Samaikyandhra supporters prevents panabaka gannavaram airport expansion conflicts

Samaikyandhra Supporters prevents Panabaka Gannavaram Airport expansion Conflicts, Panabaka Lakshmi, Gannavaram Airport expansion Conflicts

Samaikyandhra Supporters prevents Panabaka, Gannavaram Airport expansion Conflicts, Samaikyandhra Supporters prevents Panabaka Lakshmi

పనబాక సమైక్య సెగ- వివాదంలో ఎయిర్ పోర్టు

Posted: 10/02/2013 11:20 AM IST
Samaikyandhra supporters prevents panabaka gannavaram airport expansion conflicts

గుడివాడలో కేంద్రమంత్రి పనబాక లక్ష్మికి సమైక్య సెగ తగిలింది. గుడివాడ పర్యటనకు వచ్చిన ఆమెను సమైక్యవాదులు అడ్డుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చొరవ తీసుకోవాలని ఆందోళన నిర్వహించారు.

 

వివాదంలో ఎయిర్ పోర్టు

జిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ పనులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరంతర వివాదాల నడుమ నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణ విధానంలో పద్ధతులు పాటించకపోవడం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం ఈ విమానాశ్రయానికి దాదాపు 670 ఎకరాల భూమి ఉంది. దీన్ని మరింత విస్తృత పరచడానికి 600 ఎకరాల భూమి అదనంగా కావాలని ఎయిర్ పోర్టు అథారిటీ ప్రభుత్వాన్ని కోరింది. కాని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే గత పదేళ్లుగా విస్తరణం అంశం తెరమీదకు రావడం,మళ్లీ మరుగున పడిపోవడం పరిపాటిగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం 280 కోట్ల రూపాయలను ఈ విస్తరణ పనుల కోసం మంజూరు చేసింది. దావాజీగూడెంవైపు వంద ఎకరాలు, బుద్ధవరం వైపు 200 ఎకరాలు, కేసరపల్లి వైపు 191 ఎకరాలు సేకరించాలని ప్రతిపాదించారు.

 

ప్రస్తుతం రన్ వే 45 మీటర్ల వెడల్పుతో, 1,745 మీటర్ల పొడవు ఉంది. బోయింగ్ విమానాల రాకపోకలకు వీలుగా రన్ వేను 3,216 మీటర్ల పొడవు విస్తరణ చేయాలని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అటు కార్ పార్కింగ్ జోన్ కింద 104 ఎకరాలు, టెర్మినల్ భవనానికి వెళ్ళే రహదారికి 20 ఎకరాలు, రన్ వేకూ, ఇతర అవసరాలకూ వీలుగా మరింత భూమిని తీసుకోవాలని చూస్తున్నారు. ఈ ప్రతిపాదనలు అమలైతే, పొలాలతోపాటు, 200 ఇళ్లు కూడా తీసేయాల్సి వస్తుంది. అటు బుద్ధవరం పంచాయతీ నిట్టనిలువునా చీలిపోవాల్సి వస్తుంది. ప్రధాన గ్రామమంతా ఒకవైపు రాజీవ్ నగర్, దావాజీగూడెం, పామర్తినగర్ లు మరో వైపు ఉంటాయి. ఇదే జరిగితే, బుద్ధవరం, అజ్జంపూడి వెళ్లాలంటే నాలుగు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దావాగూడెనికైతే, సొంత పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలన్నా కష్టమే అవుతుంది. విస్తరణలో భూములు తీసుకుని గోడ నిర్మిస్తే వారికి కలిగే ఇబ్బందుల చెప్పుకోనక్కర్లేదు. దాదాపు 5 వేల మంది ప్రజలు గన్నవరం కావాలంటే అష్టకష్టాలు పడక తప్పని పరిస్థితి.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more