అమ్మహస్తం పథకంలో భాగంగా ఇస్తున్న సరుకుల ధరలను ప్రభుత్వం ఎక్కువ చేసి చూపుతుందనేది అర్ధమవుతోందని ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య అన్నారు. నూజివీడులో అమ్మహస్తం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జనవరిలో జిల్లా స్థాయి ఆహార సలహా సంఘం సమావేశం జరిగినప్పుడు జిల్లా ఉన్నతాధికారులు తెలిపిన బహిరంగ మార్కెట్లోని ధరలు, ఇప్పుడు చెబుతున్న ధరలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. కందిపప్పు ధర జనవరిలో రూ.50 ఉందని తెలిపిన అధికారులే నేడు రూ.73 అని, ఉప్పు రూ.9 ఉండగా రూ.14 అని చెప్తున్నారని అన్నారు. ఇలా ఎక్కువ ధరలు వేసి ప్రభుత్వం ఇంత భరిస్తుందంటూ ప్రచారం చేసుకోవడం ఎవరిని మభ్యపెట్టడానికో అర్ధం కావడం లేదన్నారు. సంక్షేమ పథకాలనేవి రాష్ట్రంలో ఎన్టీఆర్తోనే ప్రారంభమయ్యాయన్నారు.. ఆయన బియ్యాన్ని కిలో రూ.2లకే అందజేయగా, ఆ తరువాత వచ్చిన చంద్రబాబు రూ.5.50కు పెంచారన్నారు. అనంతరం వచ్చిన వైఎస్ రూ. 2లకు ఇవ్వగా, కిరణ్కుమార్రెడ్డి రూ.1కే ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం చెప్తున్నట్లు నాణ్యత ప్రమాణాలతో ఈ పథకాన్ని అమలు చేస్తే ప్రజాధరణ లభిస్తుందన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more