ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఆశ్వయుజ శుద్ధపంచమి, షష్ఠి, మూలానక్షత్రం నాడు దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సరస్వతీదేవిని చదువుల తల్లిగా భారతీయులు కొలుస్తారు. ఈ తల్లి సకల విద్యల్ని ప్రసాదించి, జ్ఞానదీపాన్ని వెలిగించే విద్యాశక్తి. త్రిశక్తుల్లో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని మూడు విధాలు. మహాసరస్వతీదేవి శుంభుడు, నిశుంభుడు అనే రాక్షసులను వధించింది. అందుకు చిహ్నంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. దసరా పదిరోజుల్లో ఈ దేవి అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజు ఈ అలంకారం చేస్తారు. ఈ రోజున విద్యార్థులు సరస్వతీదేవిని భక్తితో కొలిస్తే, అన్నింటా జయం లభిస్తుందని ఒక నమ్మకం. సరస్వతి ధవళ వస్త్రాన్ని ధరిస్తుంది. తెల్లని హంస ఆమె వాహనం. చేతిలో కచ్ఛపి అనే వీణను ధరిస్తుంది. అందుకే ఆ తల్లిని వీణాపాణిగా కొలుస్తారు. సరస్వతి బ్రహ్మదేవుడి రసనాగ్రంలో నివసిస్తుందని పురాణాలుచెబుతున్నాయి.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more