జీవితంలో తొలిసారిగా సప్తగిరీశుడిని విశాఖపట్టణం గిరిపుత్రులు ఆనందం పరమానందతో దర్శించుకున్నారు. శ్రీ శారదపీఠాధిపతి స్వరూపానంరేంద్ర సరస్వతి పర్యవేక్షణలో 712 మంది గిరిపుత్రులు తిరుమలకు కాలినడకన చేరుకున్నారు. తిరుపతి వరకు రైలు ద్వారా చేరుకున్న గిరిపుత్రులు భక్తిభావంతో గోవిందనామ స్మరణతో హోరెత్తించారు. తొలిసారిగా తిరుమలకు వచ్చిన వీరికి తితిదే ప్రత్యేక మర్యాదాలు చేసింది. యాత్రిసదన్ -2 లో వసతి కల్పన, భోజనం , తలనీలాలు సమర్పించుకునే సౌకర్యం కల్పించింది. అనంతం వైకుంఠం-1 నుంచి ఆలయంలోకి ప్రత్యేకంగా తీసుకెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకునే అవకాశం కల్పించారు. స్వామి వారి లడ్డూ ప్రసాదం, పుస్తక ప్రసాదం అందచేశారు. అయితే ఇప్పటి వరకు వారికి దేవుడంటే తెలియదని చెబుతున్నారు. అందులోనూ ఏడుకొండల స్వామి దర్శనానికి ఎన్నడూ రాలేకపోయాం అని వారు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more