ఐశ్వర్యం పొందడం కోసం ఈ నోమును ఆచరిస్తారు.
విధానం -
భాద్రపద శుద్ధ తదియ (తెల్లవారితే వినాయక చవితి) నాడు ప్రతీ సంవత్సరం ఈ నోమాన్ని నోచుకుంటారు. ఆరోజు తలస్నానం చేసి, 256 కుడుములను తయారు చేసుకోవాలి. దీంతోపాటు పదహారు కొత్త చేటలు తెచ్చి ఒక్కొక్క చేటలో పదహారు కుడుములు, పదహారు నల్లపూసలు, పదహారు రూపాయల దక్షిణ, రవిక ఉంచి... వాటిని పదహారు మంది ముత్తైదువులకు వాయనమివ్వాలి. వీరికి దాహం తీర్చడం కూడా కొందరికి సంప్రదాయం ఉంది.
ఉద్యాపనం -
ఈ విధంగా పదహారు సంవత్సరాలుపాటు దీనిని ఆచరించాల్సి వుంటుంది. ఆఖరి దశ అయిన పదహారవ సంవత్సరం 116 మంది ముత్తైదువులకు వాయనమివ్వాలి. కానీ ఈ పద్ధతిని చాలామంది వరకు అనుసరించడం లేదు. కేవలం ఒక సంవత్సరం మాత్రమే చేసే నోముగా ఉంది.
కథ -
పార్వతీ పరమేశ్వరలు ఒకసారి భూలోక సంచారం చేస్తుండగా, అడవిలో ఒక రాచకన్య కనిపించింది. ఆ కన్య తల్లిదండ్రులు రాజ్యాన్ని కోల్పోయి అడవులదారి పట్టారని వారు తెలుసుకున్నారు. వారి ఐశ్వర్యం వారికి తిరిగి రప్పించాలనుకుని ఆ రాచకన్య వద్దకు వెళ్లి ఒక నోము చెప్పారు. అదే ఈ పదహారు కుడుముల తద్ది. ఆ నోము నోచుకుంటే కష్టాలన్ని తొలిగిపోతాయని చెప్పి అదృశ్యమయ్యారు పార్వతీ పరమేశ్వరులు. వారు చెప్పిన నోమును పాటించడం వల్ల ఆ రాచకన్యకు కష్టాలు తొలిగిపోయాయి. అప్పటినుంచి ఆమె ఆ నోము ప్రతి సంవత్సరం చేయగా... క్రమంగా వ్యాప్తిలోకి వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: -... Read more
Jun 03 | ప్రాచీనకాలం నుంచి మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించుకోవడానికి... అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ఎన్నోరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆనాడు సాక్షాత్తూ దేవుళ్లు కూడా... Read more
May 07 | కథ : పూర్వం ఒకానొక సమయంలో ఒక మహారాణి తనకోసం, తన తనయుల కోసం, తన రాజ్యంలో వున్న వారందరి శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం మూల గౌరీ నోమును నోచుకుంటుంది. నోము కాలం అయిన... Read more
Apr 17 | కథ : పూర్వం ఒక రాజు కూతురు, బ్రాహ్మణ కూతురు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని గడిపేవారు. వీరిద్దరి జీవితంలో ఏ ఒక్క లోటు వుండేది కాదు. అయితే ఒకరోజు వీరిద్దరూ... Read more
Apr 16 | కథ : పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి’’ అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు. ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు... Read more